మరో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ కొన్న ఫ్లాప్‌ స్టార్‌..!

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ తనయుడు అభిషేక్ బచ్చన్‌ సినిమాల్లో ఆశించిన స్థాయిలో పాజిటివ్‌ ఫలితాలను సొంతం చేసుకోలేక పోయాడు.

Update: 2024-09-20 08:30 GMT

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ తనయుడు అభిషేక్ బచ్చన్‌ సినిమాల్లో ఆశించిన స్థాయిలో పాజిటివ్‌ ఫలితాలను సొంతం చేసుకోలేక పోయాడు. కెరీర్ ఆరంభంలో కంటిన్యూగా సినిమాలు చేసిన అభిషేక్ బచ్చన్‌ ఈ మధ్య కాలంలో అరుదుగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ లను సైతం జూనియర్ బచ్చన్ చేస్తూ వస్తున్నాడు. సినిమాలు, సిరీస్‌ లు ఆయనకు క్రేజ్ ను ఆస్తిని తెచ్చి పెట్టడం లేదు. కానీ ఆయన చేస్తున్న వ్యాపారాల కారణంగా మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. తండ్రి అమితాబ్‌ క్రేజ్ ని ఉపయోగించి జూనియర్ బచ్చన్‌ వ్యాపారాలు చేస్తున్నాడు అనేది బాలీవుడ్‌ వర్గాల్లో ఉన్న టాక్‌.


ఒక వైపు అమితాబ్ ప్రతి ఏడాది కోట్లలో పారితోషికం తీసుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఐశ్వర్య రాయ్‌ సైతం భారీ చిత్రాల్లో నటిస్తూ భారీ పారితోషికం అందుకుంటూ ఉన్న విషయం తెల్సిందే. అభిషేక్ బచ్చన్‌ ఇప్పటికే ముంబైలో పలు ఏరియాల్లో ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేయడం జరిగింది. తాజాగా మరో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ ను కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముంబై లో తాము నివాసం ఉండే జల్సా కు సమీపంలోనే జుహు ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్‌ ను కొనుగోలు చేయడం జరిగిందని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ కి చెందిన ప్రముఖ స్టార్స్ మరో ఇద్దరికి, ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఆ అపార్ట్‌మెంట్‌ లో కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. ఖరీదు ఎంత అనే విషయమై ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. కానీ ముంబై లో వినిపిస్తున్న పుకార్ల అనుసారం దాదాపు 40 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఖర్చులతో పాటు ఇతర అన్ని ఖర్చులు కలిపి దాదాపు రూ.50 కోట్ల ను అభిషేక్ బచ్చన్ ఖర్చు చేశాడనే వార్తలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలోనూ ఈ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతోంది.

సినిమాల్లో పెద్దగా ఆఫర్లు లేని స్టార్‌, ప్లాప్‌ స్టార్‌ గా ముద్ర పడ్డ అభిషేక్ బచ్చన్‌ ఈస్థాయిలో ఖర్చు పెట్టి ఆస్తులను కొనుగోలు చేయడం ఆశ్చర్యంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అభిషేక్ బచ్చన్‌ కి కేవలం సినిమాల్లో వచ్చే ఆదాయం మాత్రమే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా భారీ ఎత్తున ఆదాయం వస్తుంది. అందుకే ఆయన ఇలా వరుసగా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఆస్తులను కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి అభిషేక్ బచ్చన్‌ జల్సా లో నివాసం ఉంటున్నాడు. ఆ మధ్య ఐశ్వర్య రాయ్ తో జూనియర్‌ బచ్చన్‌ విడాకులు అంటూ ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని, ప్రస్తుతం జుహు లోనే ఐశ్వర్య, ఆద్య లు ఉంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

Tags:    

Similar News