ఫ్యాన్స్ లో ఉత్కంఠను .. ఉత్సాహాన్ని పెంచుతున్న చరణ్!

Update: 2021-09-18 08:36 GMT
చరణ్ ఒక వైపున 'ఆర్ ఆర్ ఆర్' వంటి పాన్ ఇండియా సినిమాను పూర్తి చేస్తూనే, మరో వైపున  'ఆచార్య' సినిమాను కూడా ముగింపు దశకి తీసుకొచ్చాడు. అభిమానులతో ఎక్కువ గ్యాప్ రాకుండా ఉండటం కోసం, తెలివిగా 'ఆచార్య'లోను ఒక కీలకమైన పాత్రను చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్లకు సంబంధించినవి. ఒక సినిమాలో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే, మరో సినిమాలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుని అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాడు.

ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నవే. ఆ దిశగా ఆ సినిమాలు సన్నాహాలు చేసుకుంటూ ఉండగానే, శంకర్ దర్శకత్వంలోను ఓ పాన్ ఇండియా సినిమాను లైన్లో పెట్టేశాడు. అంతేకాదు చిరంజీవి చేసే భారీ బడ్జెట్ చిత్రాలకు చరణ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తూ, ఆ ప్రాజెక్టులకు సంబంధించిన సన్నాహాలను కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇలా చరణ్ కూల్ గా కనిపిస్తూనే చలాకీగా చక్రం తిప్పేస్తున్నాడు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటున్నాడు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ట్విట్టర్లో పెట్టిన పోస్టు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ పోస్టర్లో స్మోక్ ఎఫెక్ట్ లో చరణ్ కనీ కనిపించకుండా ఉన్నాడు. ఆయన కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా దగ్గరగా ఆయనను చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. అందుకు సంబంధించిన కెమెరా కూడా ఈ పోస్టర్లో కనిపిస్తోంది. అయితే ఇది సినిమా కోసం జరుగుతున్న షూటింగా? లేదంటే ఏదైనా యాడ్ కోసం జరుగుతున్న ప్రయత్నమా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.

"ఒక సరికొత్త వినోద ప్రపంచాన్ని మీ స్క్రీన్స్ పై ఆవిష్కరించడానికి అంతా సిద్ధమైంది. సంథింగ్ స్పెషల్ గా ఒక ఎగ్జైటింగ్ అప్ డేట్ త్వరలో మీ ముందుకు రాబోతోంది" అంటూ చరణ్ రాసుకొచ్చాడు.  ఇదంతా చూస్తుంటే చరణ్ ఏదైనా టీవీ షోకి హోస్ట్ గా చేయనున్నాడా? లేదంటే 'ఆర్ ఆర్ ఆర్' కి గానీ .. 'ఆచార్య'కి గాని సంబంధించిన అప్ డేట్ ను డిఫరెంట్ గా అందించనున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒక ట్వీట్ మీటేసి చరణ్ కూల్ గానే ఉన్నాడు. కానీ ఆ అప్డేట్ ఏమిటనేది తెలుసుకునేవరకూ ఫ్యాన్స్ కి కునుకు పడుతుందా? కుదురుంటుందా? ఫ్యాన్స్ లోని ఉత్కంఠ కట్టలుతెంచుకుని ఉత్సాహం ప్రవహించే ఆ సమయం కోసం వెయిట్ చేద్దాం! 
Tags:    

Similar News