కేజీఎఫ్ డైరెక్టర్ తో యంగ్ టైగర్ సినిమా..?

Update: 2020-05-05 17:30 GMT
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన కొమరమ్ భీమ్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయనున్నాడు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే కొత్త సినిమా షూటింగ్ మే నుండి ప్రారంభం అవుతుందని ఇదివరకే ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ చాలా స్టైలిష్ గా చూపించనున్నాడనేది తాజా సమాచారం.

ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మించాలని భావిస్తున్నారట. అందుకోసం ఎన్టీఆర్ - కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టిందట. నిజానికి ఈ ప్రాజెక్ట్ పై పరస్పర ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. ఇక ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కమిట్ అయ్యాడు. ప్రస్తుతం కెజిఫ్2 షూటింగ్ లో బిజీ ఉన్న ప్రశాంత్ నీల్. ఆ సినిమా పూర్తిచేయడానికి అక్టోబర్ అవుతుందట. కొత్త మూవీ స్టార్ట్ చేయడానికి మరో ఆరు నెలలైనా పడుతుందట. అయితే త్రివిక్రమ్ మే నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తానని ఎన్టీఆర్ కి హామీ ఇచ్చాడు. ఇక త్రివిక్రమ్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేసే మూవీ ప్రశాంత్ నీల్ తోనే అని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారని టాక్.
Tags:    

Similar News