రంగస్థలం పాట.. బాలీవుడ్ హీరోతో చరణ్ స్టెప్పులు

Update: 2022-11-13 04:13 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు చాలా సిగ్గు ఎక్కువ అని అతను చాలా కూల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు అని ఎక్కువగా హడావిడి చేయడు అనే కామెంట్స్ చాలానే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా RRR సినిమా ప్రమోషన్ లో అయితే రామ్ చరణ్ పెద్దగా హడావిడి చేసింది చాలా తక్కువే. ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ అతన్ని డామినేట్ చేసినట్లు అనిపించింది అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

కానీ నిజానికి రామ్ చరణ్ ఆ తరహా మనిషి కాదు. వీలైనంతవరకు సింపుల్ గా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాడు. అయితే రామ్ చరణ్ కాస్త రెచ్చిపోతే ఎలా ఉంటుందో ఇటీవల బాలీవుడ్ మీడియాకు అర్థమైంది. శనివారం ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లైఫ్‌స్టైల్ సమ్మిట్‌ కు అక్షయ్ కుమార్, రామ్ చరణ్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఇద్దరు నటీనటులు తమ సినిమాల గురించి మరియు భారతీయ సినిమా గొప్పతనం  గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.

అయితే సాయంత్రం ప్రత్యేక అంశం ఏమిటంటే, రంగస్థలంలోని చరణ్-సమంతల రంగమ్మ మంగమ్మ పాటకు అక్షయ్ కుమార్ డ్యాన్స్ చేశాడు. అక్షయ్ చాలా సిగ్గుపడుతునే చరణ్‌తో కలిసి ఉల్లాసంగా డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్న ఒక వీడియో వైరల్‌గా మారింది. తూ చీజ్ బడి హై మస్త్ మస్త్ అనే పాటకు కూడా చరణ్ స్టెప్పులు వేశాడు.

వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక లిస్టులో గౌతం తిన్ననూరి ప్రాజెక్టు ఉన్నప్పటికీ అది ఆలస్యంగా తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం చర్చలో దశలో మరో రెండు ప్రాజెక్టులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఒక కొత్త కాంబినేషన్ పై రామ్ చరణ్ నుంచి అధికారికంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.


Tags:    

Similar News