మ‌ళ్లీ క‌లుస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో

Update: 2021-12-24 03:30 GMT
లెక్క‌ల మాస్టారు సుకుమార్ ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి బ‌న్నీతో క‌లిసి చేసిన క్రేజీ చిత్రం `పుష్ప :ది రైజ్‌`. ఈ నెల 17న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. బ‌న్నీ కెరీర్‌లో తొలిసారి మాసీవ్ పాత్ర‌లో న‌టించిన  సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఆ అంచ‌నాల‌కు కొంత త‌గ్గింద‌ని ప్ర‌చారం జ‌రిగినా వ‌సూళ్ల ప‌రంగా మాత్రం ఎక్క‌డా త‌గ్గేది లే అంటూ బాక్సాఫీస్ వ‌ద్ద హంగామా చేస్తోంది.

ఈ సినిమాకి కొన‌సాగింపుగా సుకుమార్ `పుష్ప ది రూల్‌`ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. `పుష్ప‌` స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే  సుక్కు మ‌రో ప‌క్క `పుప్ప ది రూల్` కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని ప్రారంభించేశాడు. `బాహుబ‌లి` త‌ర‌హాలో ఫ‌స్ట్ పార్ట్ కి మించి క‌థ మొత్తం సెకండ్ పార్ట్ లోనే వుండ‌టంతో అంతా `పుప్ప ది రూల్` కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సెకండ్ పార్ట్ లో కీల‌క పాత్ర‌ల‌కు సంబంధించిన సీన్ ల‌ని మ‌రింత ఎఫెక్టీవ్ గా తెర‌పైకి తీసుకురావాల‌ని సుకుమార్ ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే `పుప్ప ది రూల్` త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ భారీ సినిమాని చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీని ప్ర‌క‌టించారు కూడా. ప్రాజెక్ట్ ఆల‌స్యం అవుతున్న నేప‌థ్యంలో వుంటుందా?  లేదా? అని ప్ర‌చారం జ‌రిగింది. ఆ వార్త‌ల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ ఫాల్క‌న్ సంస్థ అధినేత విజ‌య్ దేవ‌ర‌కొండ - సుకుమార్ సినిమా ఖ‌చ్చితంగా వుంటుంద‌ని క్లారిటీ ఇచ్చారు కూడా. ఇక ఈ సినిమా త‌రువాత `రంగ‌స్థ‌లం` కాంబినేష‌న్ రిపీట్ కానుంద‌ని తెలుస్తోంది.

`పుష్ప` ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మాట్లాడిన సుకుమార్ .. `పుప్ప ది రూల్` త‌రువాత తాను చేయ‌బోయే చిత్రాల గురించి వెల్ల‌డించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ తో సినిమా వుంటుంద‌ని, ఆ త‌రువాతే రామ్ చ‌ర‌ణ్ సినిమా వుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సుకుమార్. అయితే చ‌ర‌ణ్ తో ప్రాజెక్ట్ మాత్రం ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే వుంద‌ని తెలిపారు. సుక్కు - చ‌ర‌ణ్ ల తొలి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `రంగ‌స్థ‌లం` బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందించింది. ఇదే కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్ అయితే ఆ సినిమా ఏ రేంజ్‌లో వుంటుందోన‌ని అప్పుడే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. 
Tags:    

Similar News