సినిమా టీవీ రంగంలో క్రియేటర్ల కోసం 10 లక్షల కోట్ల డాలర్ల సాయం?
ఇటీవల కేంద్రం దేశంలో అభివృద్ధి చెందుతున్న సృష్టికర్తల ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి 1 బిలియన్ డాలర్ల నిధిని ప్రకటించింది.;
100 దేశాల నుంచి 80వేల క్రియేటర్లు.. ఒక బిలియన్ డాలర్ (పది లక్షల కోట్ల డాలర్లు) నిధి సేకరణ.. ఇదంతా క్రియేటర్లకు ధారాదత్తం.. ఈ హడావుడి అంతా దేనికోసం? భారత ప్రభుత్వం వినోదరంగంలో ఏదో పెను మార్పు కోసం ఇంకేదో చేస్తోందని కొంతకాలంగా చర్చ సాగుతోంది. మహారాష్ట్ర గుర్ గావ్ కేంద్రంగా క్రియేటివిటీ ఉన్న మేధావులందరితో ప్యానెల్ చర్చలు సమావేశాలు జరగనున్నాయి. అంతేకాదు క్రియేటర్లకు కావాల్సినంత డబ్బు సహకారం కూడా అందించనున్నారనేదే ఇక్కడ ప్రధానంగా చర్చ. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఇటీవల కేంద్రం దేశంలో అభివృద్ధి చెందుతున్న సృష్టికర్తల ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి 1 బిలియన్ డాలర్ల నిధిని ప్రకటించింది. ముంబైలో జరగనున్న మొదటి ప్రపంచ ఆడియో విజువల్ & ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES)లో పాల్గొనాలని కోరుతూ 100 కి పైగా దేశాల రాయబారులను సంప్రదించింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, సమాచార- ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇక్కడ రాయబారులకు ఆతిథ్యం ఇచ్చారు. వేవ్స్ సమ్మిట్ 2025 సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహించే అగ్ర మీడియా సీఈవోల రౌండ్టేబుల్లో వారిని హాజరు కావాలని కోరారు.
మే 1 నుండి 4 వరకు జరిగే వేవ్స్ భారతదేశం, పాలన- వ్యాపార రంగాలకు చెందిన అంతర్జాతీయ నాయకుల సమావేశం అయిన దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తరహాలో మీడియా, వినోద రంగానికి మొదటి కన్వర్జెన్స్ వేదిక కానుంది. భారతదేశ వినోద రాజధాని ముంబై `వేవ్స్ సమ్మిట్`కు సరైన శాశ్వత వేదిక అని ముఖ్యమత్రి ఫడ్నవిస్ అన్నారు.
సృష్టికర్తల ఆర్థిక వ్యవస్థ కోసం 1 బిలియన్ అమెరికన్ డాలర్ల నిధిని సృష్టించనున్నట్లు మహారాష్ట్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి శ్రీ వైష్ణవ్ ప్రకటించారు. తాజా సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్న శక్తివంతమైన సృష్టికర్తలకు ఈ మూలధనం ఉపకరిస్తుందని, సాంకేతికంగా వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలరని, వారి ఉత్పత్తి స్థాయిలను అప్గ్రేడ్ చేయగలరని, ప్రపంచ మార్కెట్లను చేరుకోగలరని దానికోసం ఈ నిధి అంకితమవుతుందని మంత్రి శ్రీ వైష్ణవ్ అన్నారు. ముంబైలో మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నామని, మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్గావ్లోని ఫిల్మ్ సిటీలో భూమిని కేటాయించిందని మంత్రి శ్రీవైష్ణవ్ ప్రకటించారు. సమాచార, ప్రసార కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, ఎస్ జైశంకర్ - శ్రీ వైష్ణవ్ గ్లోబల్ మీడియా డైలాగ్ను నిర్వహిస్తారని, థాట్ లీడర్స్ ట్రాక్లో పరిశ్రమ నాయకుల ప్లీనరీ సెషన్లు, ప్యానెల్ చర్చలు ఉంటాయని అన్నారు.
WAVES బజార్ వల్ల ప్రయోజనాలు ఏమిటి?
*వేవ్స్ వ్యాపార అవకాశాలను పెంపొందించడానికి కొనుగోలుదారు-అమ్మకందారుల సమావేశాలతో పాటు కంటెంట్ ప్రదర్శనను అందించే మార్కెట్ప్లేస్గా ఉంటుంది.
* ఇక్కడ క్రియేటోస్పియర్ లో యువ సృష్టికర్తలు మాస్టర్క్లాస్లు, వర్క్షాప్లు, నెట్వర్కింగ్ సెషన్ల ద్వారా కనెక్ట్ అవ్వడానికి, నేర్చుకోవడానికి సహకరించడానికి ఒక వేదిక.
*ఈ చొరవ వెనుక ఉన్న అసలు ఉద్ధేశం సృజనాత్మక ప్రపంచాన్ని, ఆధునిక సాంకేతిక వినియోగాన్ని కలిపి ప్రత్యేకమైన కంటెంట్ను సృష్టించడం లక్ష్యం.
*100 కి పైగా దేశాలు దీనిలో పాల్గొంటున్నాయి .. ఇది సాంకేతికత, మీడియా, వినోదం సంగమం ఇది.
వేవ్స్ కంటే ముందు ప్రారంభించిన `క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్` 25 లక్షలకు పైగా ప్రెజెంటేషన్స్ వచ్చాయి. 80,000 కంటే ఎక్కువ మంది సృష్టికర్తలు సవాల్ని తదుపరి స్థాయికి తీసుకెళతారు. 80,000 ఎంట్రీలలో 1,000 మందికి అవకాశం దక్కుతుంది. వేవ్స్ సమ్మిట్ సందర్భంగా జరిగే ఫైనల్స్లో వీరంతా పాల్గొంటారు.