ప‌న్ను చెల్లింపులో షాక్ ఇచ్చిన బ్యూటీ!

మ‌రి భార‌తీయ న‌టీమ‌ణుల్లో టాప్ స్థానంలో ఎవ‌రు ఉన్నారు? అంటే క‌రీనా క‌పూర్ గా తేలింది.

Update: 2024-09-06 07:45 GMT

ప‌న్ను చెల్లింపులో భార‌తీయ సెల‌బ్రిటీలంద‌రిలో బాద్ షారుఖాన్ మొద‌టి ప్లేస్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. 2024 సంవత్స‌రానికి గానూ అత్య‌ధికంగా 94 కోట్లు ప‌న్నుల రూపంలోనే చెల్లిచారు. ఆ త‌ర్వాత స్థానాల్లో విజ‌య్, స‌ల్మాన్ ఖాన్ నిలిచారు. మ‌రి భార‌తీయ న‌టీమ‌ణుల్లో టాప్ స్థానంలో ఎవ‌రు ఉన్నారు? అంటే క‌రీనా క‌పూర్ గా తేలింది. ఈ అమ్మ‌డు 2024 సంవత్సరానికి పన్నుల రూపంలో 20 కోట్లు చెల్లించింది.


దీంతో క‌రీనా అదాయం ఎంత‌గా రెట్టింపు అయింద‌న్న‌ది అద్దం పడుతుంది. వ‌య‌సుతో పాటు అమ్మ‌డి ఆదాయం కూడా అంతకంత‌కు పెరిగిపోతుంది. కరీనా సినిమాలు, ఎండార్స్‌మెంట్‌లు, బిజినెస్ వెంచర్‌ల నుండే భారీగా ఆదాయం స‌మ‌కూరుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 'ది క్రూ'తో భారీ స‌క్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

త్వ‌ర‌లో 'సింగం ఎగైన్' తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సినిమాల పరంగా ఈ ఏడాది ఈ రెండు సినిమాలే అమ్మ‌డి నుంచి వచ్చిన చిత్రాలుగా చెప్పాలి. ఆ రెండింటి త‌ర్వాత ఏ సినిమా చేస్తుంది? అన్న‌ది క్లారిటీ లేదు. కానీ అమ్మ‌డు ఎక్కువ‌గా ఎడార్ మెంట్స్ ద్వారా అర్జిస్తుంది. క‌రీనా ఎలాంటి ప్ర‌క‌ట‌న విడిచి పెట్ట‌దు. అలాగ‌ని క‌రీనా రేంజ్ త‌గ్గ‌ని యాడ్స్ లోనే క‌నిపిస్తుంది.

అందుకు గానూ కోట్ల రూపాయ‌లు పారితోషికం తీసుకుంటుంది. అలాగే వివిధ వ్యాపారాల్లోనూ క‌రీనా భారీగా పెట్టుబ‌డులు పెట్టింది. వృత్తి -వ్య‌క్తిగ‌తంగా అమ్మ‌డికి సైఫ్ అలీఖాన్ ని వివాహం చేసుకున్న త‌ర్వాత బాగానే కలిసొచ్చింది. క‌రీనా త‌ర్వాత అత్య‌ధికంగా ప‌న్ను చెల్లించింది కియారా అద్వానీ. ఈ అమ్మ‌డు 12 కోట్లు చెల్లించింది.

Tags:    

Similar News