అంచనాలకు మించి గేమ్ ఛేంజ‌ర్: కియ‌రా అద్వాణీ

Update: 2023-08-05 02:30 GMT

కియారా అద్వానీ.. నేటిత‌రంలో వేగంగా స్టార్ డ‌మ్ అందుకున్న నాయిక‌. త‌న‌దైన అందం అభిన‌యంతో భారీ ఫాలోయింగ్ సంపాదించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో బిజీగా ఉంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్‌తో కియారాకి ఇది రెండో సినిమా. శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా గురించి కియ‌రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇప్ప‌టికి రెండేళ్లుగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. 2023 చివ‌రి నాటికి చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి కానుంద‌ని కియారా తెలిపారు. రామ్‌చరణ్‌ తన ప్రియ మిత్రుడని త‌న నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఈ సంద‌ర్భంగా కియ‌రా పేర్కొంది. సినిమా బాగా షేప‌ప్ అయింది. ఊహ‌కు అంద‌ని ట్రీట్ సిల్వ‌ర్ స్క్రీన్ పై ఆస్వాధిస్తారు. ఎవ‌రి ఊహకూ అంద‌నంత‌ ఎక్కువ`` అని కియ‌రా తెలిపారు. ఈ సినిమా కోసం మా చెమ‌ట‌లు ధార‌పోసాం.. ర‌క్తం చిందించాం అని కొంత ఎమోష‌న‌ల్ ట‌చ్ తో కియ‌రా మాట్లాడారు.

మెగాభిమానుల‌కు ఈ క‌బురు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. 2023-24 సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒక‌టిగా `గేమ్ ఛేంజ‌ర్` పేరు రికార్డుల్లో నిలిచి ఉంది. ర‌జ‌నీతో 2.0 లాంటి భారీ చిత్రాన్ని తెర‌కెక్కించిన మేటి సౌత్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ నుంచి వ‌స్తున్న సినిమాగా గేమ్ ఛేంజ‌ర్ పై భారీ అంచ‌నాలున్నాయి. దాదాపు 400కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నార‌న్న ప్ర‌చారం ఉంది. ఈ చిత్రంలో భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. అలాగే హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ప‌ని చేస్తున్నారు. పాన్ ఇండియా కేట‌గిరీలో తెలుగు-త‌మిళం-హిందీ స‌హా అన్ని భాష‌ల్లోను ఈ చిత్రాన్ని అత్యంత భారీగా విడుద‌ల చేయాల‌నేది ప్లాన్.

Tags:    

Similar News