దేవర.. డబుల్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కొరటాల!

ఇక ఇప్పుడు దర్శకుడు సడన్ గా రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుంది అని చెప్పేసాడు.

Update: 2023-10-04 11:07 GMT

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న బిగ్ బడ్జెట్ ప్లాన్ ఇండియా మూవీ దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కు ముందుకు కొనసాగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అనేక రకాల విషయాలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఒక ఐలాండ్ కు సంబంధించిన కథతో దర్శకుడు ఈ సినిమాను భారీ స్థాయిలో వెండితెరపైకి తీసుకు రాబోతున్నట్లు ముందుగానే టాక్ వినిపించింది.

ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక తెగకు చెందిన చెందిన నాయకుడిగా కనిపిస్తాడు అని వారికోసం పోరాడేందుకు ఎంత దూరమైన వెళతాడు అని కూడా కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ ఊహించిన విధంగా ఒక సడన్ సర్‌ప్రైజ్‌ అయితే ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రావడం ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఈ సినిమా సీక్వెల్ అనే టాక్ అయితే ఎక్కడ రాలేదు.

ఇక ఇప్పుడు దర్శకుడు సడన్ గా రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుంది అని చెప్పేసాడు. అందరూ మర్చిపోయినా కొన్ని తీర ప్రాంతాలకు సంబంధించిన కథగా బిగ్ స్పాన్లో ఈ దేవరకథను రూపొందిస్తున్నట్లుగా చెప్పాడు.

అయితే కథను మరింత వివరంగా చెప్పేందుకు రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లుగా చెప్పారు. కథలో ఎక్కడ మార్పులు లేకుండా మరింత ఎంటర్టైన్మెంట్ వచ్చేలా సినిమాను ఉంటుంది అని తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని కొరటాల శివ ధీమా వ్యక్తం చేశారు. ఇక అనుకున్నట్లుగానే మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నామని అది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని కొరటాల తెలియజేశాడు.

ఈ విషయం ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పుడున్న చాలా ఫ్యాన్ ఇండియా సినిమాలు కూడా మొదట రెండు భాగాలు అని చెప్పకపోయినా ఆ తర్వాత నిడివి ఎక్కువ అవుతుండడంతో రెండు భాగాలుగా రూపొందిస్తూ వస్తున్నారు. పుష్ప కూడా ఇలానే మధ్యలో సడన్ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మరి ఇక ఇప్పుడు దేవర సినిమా ఈ ట్రిక్ తో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News