'దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి'.. నాగ వంశీ కామెంట్స్..
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించిన మూవీ మ్యాడ్ స్క్వేర్ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.;

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించిన మూవీ మ్యాడ్ స్క్వేర్ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ హిట్ అయిన మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన ఆ సినిమా.. ఉగాది కానుకగా గ్రాండ్ గా రిలీజైంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి నిర్మాత నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరించారు.
అయితే టాక్ కాస్త తేడాగా వచ్చినా.. మ్యాడ్ స్క్వేర్ ఇప్పుడు వసూళ్ళ పరంగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. అలా వరల్డ్ వైడ్ గా మ్యాడ్ స్క్వేర్ అదరగొడుతోంది. రీసెంట్ గా నాగ వంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు. పెంచిన టికెట్ రేట్లు తగ్గించామని చెప్పారు. ఆ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి మ్యాడ్ స్క్వేర్ థియేటర్లో ఆడుతోందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై నాగవంశీ ఫైర్ అయ్యారు. తమ మూవీకి హిట్ టాక్ వచ్చిందని, కానీ కొందరు ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదని క్వశ్చన్ చేశారు. మూవీ బాగుంది కాబట్టి అంతా చూస్తున్నారని, థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు.
"మిగతా మూవీలు బాగోలేదు కాబట్టి మ్యాడ్ స్క్వేర్ చూస్తున్నారని కొందరు అంటున్నారు. అది కరెక్ట్ కాదని తెలుసుకోవాలి. మ్యాడ్ స్క్వేర్ నటులు పెద్ద హీరోలు కాదు. సినిమా బాహుబలి 2, పుష్ప 2, కేజీఎఫ్ 2 వంటి సీక్వెల్ కాదు. కాబట్టి కంటెంట్ ఉంది కనుకే చూస్తున్నారు. నేను థియేటర్స్ కు వెళ్లి అబ్జర్వ్ చేశాను. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగానే వస్తుంది" అని చెప్పారు.
కానీ ఆడియన్స్ కు అర్థమైనంతగా తప్పుడు రివ్యూస్ రాస్తున్న కొందరికి అర్థం కాలేదా అని నాగవంశీ ప్రశ్నించారు. "మూవీ రిలీజ్ అయ్యాక అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను. కానీ నేనేం అనలేదు. అయితే కొందరి రివ్యూలపై పోస్టులు కనిపిస్తున్నాయి. నేను మూవీస్ తీస్తేనే మీ వెబ్ సైట్స్, ఇంటర్వ్యూలు ఇస్తేనే యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతున్నాయి" అంటూ వ్యాఖ్యానించారు.
అంతే కాదు.. తాము యాడ్స్ ఇస్తేనే సైట్స్ పనిచేస్తాయని ఆరోపించారు. అందుకే సినిమాలను చంపకండని కోరారు. సినిమా మంచిగా ఆడుతున్నా కూడా.. కంటెంట్ లేని మూవీ ఆడుతోందని తప్పుడు రివ్యూస్ ఇవ్వొద్దని చెప్పారు. సినిమాలు ఉంటే అంతా ఉంటారని, కాబట్టి అది గుర్తుంచుకొని బిహేవ్ చేయండని నాగవంశీ ఫుల్ ఫైర్ అయ్యారు.
కొందరు కలెక్షన్లపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఫేక్ అని అంటే.. దాన్ని ప్రూవ్ చేయాలని ఛాలెంజ్ విసిరారు. ఎవరికి అనుమానం ఉంటే.. తన దగ్గరకు రావాలని అన్నారు. అప్పుడు అన్నీ ప్రూఫ్స్ తో చూపిస్తారని తెలిపారు.
"నేను ఇంత మాట్లాడాను కదా.. నాపై పగ ఉంటే దమ్ముంటే నా సినిమాలు చూడటం మానేయండి.. నా చిత్రాలు బ్యాన్ చేయండి.. నా సినిమా ఆర్టికల్స్ రాయకండి.. రివ్యూస్ రాయకండి... నా నుంచి యాడ్స్ తీసుకోకండి.. నాకేం అవసరం లేదు.. నేనెలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు.. మీరు ప్రమోట్ చేస్తేనే నా సినిమా ఆడటం లేదు కదా" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.