భగవంత్ నిర్మాతల లైన్ లో క్రేజీ హీరోలు

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోన్న సినిమా భగవంత్ కేసరి. ఈ చిత్త్రాన్ని షైన్ స్క్రీన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది

Update: 2023-10-18 04:27 GMT

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోన్న సినిమా భగవంత్ కేసరి. ఈ చిత్త్రాన్ని షైన్ స్క్రీన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ ప్రొడక్షన్ నుంచి వస్తోన్న నాలుగో సినిమా ఇది కావడం విశేషం. మజిలీ, టక్ జగదీష్, ఉగ్రం సినిమాలని ఇప్పటి వరకు నిర్మించింది. ఇప్పుడు భగవంత్ కేసరితో భారీ బడ్జెట్ చిత్రాల వైపు అడుగులు వేసింది.

ఈ సినిమాపై నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు. దీని తర్వాత మరల యంగ్ హీరోలని నిర్మాతలైన సాహు గారపాటి, హరీష్ పెద్ది లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ట్రెండ్ లో దూసుకుపోతున్న నవీన్ పొలిశెట్టి, విశ్వక్ సేన్ లతో మూవీస్ కన్ఫర్మ్ చేసుకున్నారు. వారికి అడ్వాన్స్ లు కూడా ఇవ్వడం జరిగిందంట. విశ్వక్ సేన్ తో ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు టాక్.

త్వరలో ఈ చిత్రానికి సంబందించిన ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందంట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. అలాగే మాస్ మహారాజ్ రవితేజతో కూడా ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసుకున్నారంట. అయితే రవితేజ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టుకొని ఉన్నాడు. మరి ఈ లైన్ అప్ లో షైన్ స్క్రీన్స్ వారిది ఎప్పుడు వస్తుందో అనేది వేచి చూడాలి.

అయితే షైన్ స్క్రీన్ నిర్మాతలు ఒకేసారి రెండు, మూడు సినిమాలు కాకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్లాలని అనుకుంటున్నారంట. అందులో భాగంగానే భగవంత్ కేసరి రిలీజ్ అయిన తర్వాత మూవీ సక్సెస్ లేదా ఫెయిల్యూర్ బట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. రామ్ తాళ్ళూరి నిర్మాణంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. అది కంప్లీట్ అయ్యాక షైన్ స్క్రీన్స్ వారి మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే అవకాశం ఉందంట.

Tags:    

Similar News