శ్రీలంకలో 40 రోజులు విజ‌య్!

విజ‌య్ దేవ‌ర‌కొండ కథానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-07-02 06:24 GMT

విజ‌య్ దేవ‌ర‌కొండ కథానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ కి జోడీగా భాగ్య శ్రీ భోర్సే న‌టిస్తోంది. ఇటీవ‌లే విశాఖప‌ట్ట‌ణంలో ఓ కీల‌క షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా కొత్త షెడ్యూల్ శ్రీలంక‌లో ప్రారంభిం చేందుకు యూనిట్ రెడీ అవుతోంది. అక్క‌డ జ‌రిగే లాంగ్ షెడ్యూల్ ఇది. దాదాపు 40 రోజుల పాటు శ్రీలంకలోనే షూటింగ్ నిర్వ‌హిస్తారు.

భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు మ‌రికొన్ని చిత్రీక‌రించ‌ను న్నారు. సినిమాలో ఈ స‌న్నివేశాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్ల‌ర్ కావ‌డంతోనే అక్క‌డి లొకేష‌న్ల‌లో కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించాల్సి రావ‌డంతో యూనిట్ వెళ్తుంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే రెండ‌వ భాగం క‌థ‌కి...శ్రీలంక నేప‌థ్యానికి చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉందంటున్నారు. మ‌రి ఆ సంగ‌తేంటో తెలియాలి.

Read more!

అయితే ఈ సినిమా షూటింగ్ చాలా నెమ్మ‌దిగా జ‌రుగుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన చాలా కాలానికి సెట్స్ కి తీసుకెళ్లారు. షూటింగ్ మొద‌లైన త‌ర్వాత వేగంగా జ‌ర‌గ‌లేదు. అందుకు ద‌ర్శ‌కుడు ప‌నితీరు కూడా ఓ కార‌ణం. గౌత‌మ్ మేకింగ్ స్లోగా ఉంటుంద‌ని, స‌మ‌యం ఎక్కువ‌గా తీసుకుంటార‌నే విమ‌ర్శ ఉంది. ఆ కార‌ణంగా బ‌డ్జెట్ కూడా పెరుగుతుంది. జెర్సీ షూటింగ్ స‌మ‌యంలో ఇదే విమ‌ర్శ తెర‌పైకి వ‌చ్చింది.

మ‌రి విజ‌య్ సినిమా ఎప్పుడు పూర్త‌వుతుంది? అన్న‌ది తెలియాలి. అయితే మేక‌ర్స్ ఆగ‌స్టు చివ‌ర‌కిల్లా పూర్తి చేయాల‌ని టార్గెట్ గా పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. సినిమాకి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులకు కూడా ఎక్కువ‌గానే స‌మ‌యం ప‌డుతుంద‌ని చిత్ర‌వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. గౌత‌మ్ తిన్న‌నూరి గ‌త సినిమా జెర్సీ కూడా ఇదే బ్యాన‌ర్ లో నిర్మాణ‌మైన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News