వద్దంటే చుడీదార్ వేసుకుందని భార్యను చంపేశాడు

వీరిద్దరు కొత్తపేట సరస్వతీనగర్ లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు.

Update: 2024-10-14 07:30 GMT

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అనుమానం పెనుభూతమై.. చిన్న విషయానికి భార్యను చంపేసిన ఘోరం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తాను వద్దన్నా.. చుడీదార్ వేసుకుందున్న ఒక్కకారణానికి మ్రగంగా మారిన భర్త.. భార్యను విచక్షణరహితంగా పొడిచి చంపేసిన వైనం షాకింగ్ గా మారింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ హత్య ఉదంతంలోకి వెళితే.. కొణిజేడు గ్రామానికిచెందిన వెంకటేశ్ - సోనీలు దంపతులు.

వీరిద్దరు కొత్తపేట సరస్వతీనగర్ లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. వారికి పద్నాలుగేళ్లు.. పన్నెండేళ్లు. వెంకటేశ్ భవన నిర్మాణ మేస్త్రీగా పని చేస్తుంటే.. సోనీ ఇళ్లల్లో పని చేస్తూ ఉంటుంది. కొద్దిరోజులుగా సోనీపైఅనుమానాన్ని పెంచుకున్నాడు భర్త వెంకటేశ్. ఇటీవల సోనీ తన వస్త్రధారణ మార్చుకొని చుడీదార్ వేసుకుంటోంది. అయితే.. ఆ డ్రెస్ వేసుకోవద్దని గొడవ పడేవాడు.

ఆదివారం ఒకరి ఇంటికి పని కోసం వెళ్లిన భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా డ్రెస్ మీద గొడవ జరిగింది. దీంతో ఆమె చుడీదార్ నున చించేశాడు. ఆపై కూరగాయలు కోసే కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.తీవ్ర రక్తస్త్రావానికి గురైన ఆమె స్ప్రహ తప్పింది. సమాచారం అందుకున్న108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని ఆమె చనిపోయినట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు.

ఈ సందర్భంగా పోలీసుల విచారణలో భార్య తనపై దాడి చేస్తే.. తప్పించుకోవటానికి తాను చేసిన పోరులో గాయాలు అయినట్లుగా చెబుతూ.. తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. చివరకు తానే చంపినట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News