దువ్వాడ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్టు.. మళ్లీ రచ్చ షురూ

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీను స్నేహితురాలిగా పేర్కొనే మాధురి తాజాగా ఇంట్లోకి వెళ్లిపోయారు.

Update: 2024-09-08 04:31 GMT

అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు అన్న పేరుతో వచ్చిన టాలీవుడ్ మూవీ కామెడీ కం ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ సైతం అదే తీరులో నడుస్తుందని చెప్పాలి. తన స్నేహితురాలు దివ్వెల మాధురికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యత.. మొత్తం కారణంగా చెప్పాలి. దువ్వాడ శ్రీను ఉంటున్న ఇంటి వద్ద గడిచిన నెల రోజులుగా శ్రీను భార్య వాణి.. కుమార్తె నిరసన వ్యక్తం చేయటం.. ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయటం తెలిసిందే.

అయినప్పటికీ వారిని దువ్వాడ అనుచరులు లోపలకు అనుమతించటం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీను స్నేహితురాలిగా పేర్కొనే మాధురి తాజాగా ఇంట్లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా నెలకొంది. లోపలకు వెళుతున్న మాధురిని అడ్డుకునేందుకు దువ్వాడ శ్రీను భార్య.. కుమార్తెలు ప్రయత్నించారు. అయినప్పటికీ మాధురి లోపలకు వెళ్లిపోయారు.

ఇంట్లోకి వెళ్లిన మాధురి.. సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్లి.. కింద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భార్య వాణి.. కుమార్తెల వీడియోను తీయటంతో ఈ ఇష్యూ మరో మలుపు తిరిగింది. తమను తమ ఇంట్లోకి ఎందుకు అనుమతించరు? అంటూ భార్య వాణి పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ వరదల కారణంగా దువ్వాడ శ్రీను ఇష్యూ సైడ్ ట్రాక్ కు వెళ్లగా.. తాజాగా స్నేహితురాలు మాధురి ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వటం ఇప్పుడు ఈ ఇష్యూ మరో మలుపు తిరిగినట్లైంది.

Tags:    

Similar News