అమిత్ షా స‌భ‌లో..బీజేపీ నేత‌ల ఆందోళ‌న‌

Update: 2017-05-25 14:35 GMT
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు ఊహించ‌ని నిర‌స‌న ఎదురైంది. ఏపీలో పార్టీ విస్త‌ర‌ణ‌, బ‌లోపేతం కోసం ప‌ర్య‌టిస్తున్న అమిత్ షా  విజ‌య‌వాడ‌లో నిర్వ‌హిస్తున్న స‌భలో బీజేపీ శ్రేణులు త‌మ ఆవేద‌న‌ను, ఆగ్ర‌హాన్ని వెళ్ల‌గ‌క్కాయి. సేవ్ బీజేపీ అంటూ ప‌లువురు పార్టీ నేత‌లు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలా అమిత్ షా సాక్షిగా బ‌హిరంగం సభలో బీజేపీ కార్యకర్తల నిర‌స‌న క‌ల‌క‌లంగా మారింది.

అమిత్ షా హాజ‌రైన స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగానికి ముందు కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత వెంక‌య్య‌నాయుడు ప్ర‌సంగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ ''లీవ్ టీడీపీ... ఓన్లీ బీజేపీ'' అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటుగా నినాదాలు చేశారు. దీంతో స‌భ‌లో ఒక్క‌సారి క‌ల‌కలం రేగింది. దీంతో అల‌ర్ట్ అయిన పోలీసులు ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వారిని సభ నుంచి బ‌యటకు పంపేశారు. కాగా, సాక్షాత్తు కేంద్ర‌, రాష్ట్ర మంత్రుల స‌మ‌క్షంలో బీజేపీ నేత‌లు ఈ విధంగా టీడీపీని వ‌దిలిచుకోవాల‌ని నినాదాలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News