మ‌ర‌ద‌లిపై మోజు.. భార్యను ఏం చేశాడంటే!

Update: 2023-01-14 13:30 GMT
వివాహేత‌ర సంబంధాలు రోజు రోజుకు దేశంలో పెరిగిపోతున్నాయి. వీటికి ఒక లెక్క ప‌త్రం కూడా ఉండ‌డం లేదు. వావి వ‌ర‌స అస‌లే క‌నిపించ‌డం లేదు. తాజాగా ఒక వ్య‌క్తి ... త‌న భార్య చెల్లిపై  క‌న్నేశాడు.

వ‌ర‌సకు ఆమె మ‌ర‌ద‌ల‌ని తెలిసి కూడా.. ఆమెను కూడా పెళ్లి చేసుకుంటాన‌ని మంకు ప‌ట్టు ప‌ట్టాడు. కానీ, కుటుంబ స‌భ్యులు నిరాకరించారు. భార్య ఉండ‌గా ఆమెను ఎలా పెళ్లి చేసుకుంటావు? అని ప్ర‌శ్నించారు.

అంతే..!  భార్య‌లేక‌పోతే చేసుకోవ‌చ్చ‌ని అనుకున్నాడో ఏమో.. వెంట‌నే భార్య‌ను క‌డ‌తేర్చాడు.  ఈ దారుణ ఘటన జార్ఖండ్లో వెలుగులోకి వచ్చింది. స్థానిక  ధన్బాద్ జిల్లా మహవీర్ నగర్కు చెందిన అనిల్ డోమ్ అనే వ్యక్తికి అంజలీ దేవి అనే మహిళతో కొన్నేళ్ల కింద‌టే వివాహం జరిగింది. అయితే ఆమె చెల్లెలు దివ్యను కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.

దీనికి ఆమె కుటుంబసభ్యులు తిరస్కరించారు. అంతేకాదు.. ఒక భార్య ఉండ‌గా.. మ‌రొక‌రిని ఎలా పెళ్లి చేసుకుంటావ‌ని నిల‌దీశారు. దీనిని డబుల్ మీనింగ్‌లో అర్థం చేసుకున్న డోమ్‌.. భార్యను ఎలాగైనా అడ్డు త‌ప్పించేసి..మ‌ర‌ద‌లిని పెళ్లి చేసుకోవాల‌ని భావించాడు.

ఈ నెల  8న ఆమెను ఇంట్లో నుంచి రోడ్డు పైకి ఈడ్చుకొచ్చి కత్తితో దారుణంగా పొడిచాడు. అంతేకాదు, అంజలీ దేవిని కాపాడేందుకు అడ్డుగా వచ్చిన అతడి మరదలు, అత్తకు కూడా గాయాలయ్యాయి.

హాస్పిటల్లో చికిత్స పొందుతూ  అంజ‌లీ దేవి మృతి చెందింది. ఘటనానంతరం అనిల్ పరారయ్యాడు. త‌ర్వాత‌.. పోలీసుల‌కు చిక్కిన అనిల్ నేరాన్ని అంగీకరించాడు. తాను వన్ సైడ్ లవ్ చేసిన మరదలిని దక్కించుకునేందుకే భార్యను హత్య చేశానని  చెప్పాడు. మొత్తానికి మ‌ర‌ద‌లితో పెళ్లేమో కానీ.. పోలీసులు జైలుకు త‌ర‌లించారు.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News