హైదరాబాద్ లో మోడీని దోపిడీదారుగా చూపిస్తూ ఫ్లెక్సీ.. వైరల్

Update: 2022-07-02 05:30 GMT
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈరోజు హైదరాబాద్ కు రానున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఆయన రెండు రోజుల పర్యటన పెట్టుకున్నారు. ఇక్కడి బీజేపీ నేతలతోనూ సమావేశం కానున్నారు.

దేశంలోని ముఖ్యమైన బీజేపీ నేతలందరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే మోడీ ఖ్యాతిని దెబ్బతీసేలా కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అవిప్పుడు హైదరాబాద్ లో వైరల్ అవుతున్నాయి.

మోడీ హైదరాబాద్ టూర్ సందర్భంగా ఒక ఆసక్తికర కటౌట్ అందరి దృష్టిని ఆకర్షించింది.  ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీఆర్ఎస్ మద్దతుదారులు ఇప్పుడు దీన్ని తెగ షేర్ చేస్తూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు.

ఈ వైరల్ కటౌట్ ను హైదరాబాద్ లో ఫ్లెక్సీగా ఒక హోర్డింగ్ పై ఏర్పాటు చేశారు. కొందరు దోపిడీదారుల ఫొటోలు పెట్టి 'మేం బ్యాంకులను దోచుకుంటుంటే.. మిస్టర్ నరేంద్రమోడీ మీరు దేశాన్ని దోచుకుంటున్నారు..' అని కటౌట్ లో ఉంది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఈ కటౌట్ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ స్నాప్ ఇప్పటికే వైరల్ అవుతోంది. కటౌట్ లో టీఆర్ఎస్ నేతల హస్తం ఉందన్న అనుమానంతో బీజేపీ సేనలు ఆగ్రహానికి గురవుతున్నాయి. . రానున్న కాలంలో టీఆర్ఎస్ కు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు.

మొత్తంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ ఎలాగైనా సరే బీజేపీని, మోడీ ఖ్యాతిని తగ్గించాలని దాని ప్రత్యర్థులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనివెనుక టీఆర్ఎస్ ఉందన్న అనుమానాలు బీజేపీ వ్యక్తం చేస్తోంది. వీరిద్దరి వైరం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Tags:    

Similar News