ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నుంచి లేఖ వస్తే ఏ అధికారైనా చెప్పిన పని చేయాల్సిందే.. కానీ, కేజీహెచ్ వైద్యులు మాత్రం చంద్రబాబు లేఖనూ పక్కన పెట్టేశారు. డబ్బులు తెస్తేనే ఆపరేషన్ చేస్తామంటూ ఓ నిరుపేదను తిప్పి పంపించారు. దీంతో ఇప్పుడా కుటుంబం తిరిగి ఇంటికి వెళ్లడానికి కూడా డబ్బుల్లేక అక్కడఇక్కడా కాలం వెల్లదీస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన బొర్రా లక్ష్మీనారాణకు తీవ్ర వెన్ను నొప్పి రావడంతో 1995లో విశాఖపట్నంలోని కేజీహెచ్ లో ఆపరేషన్ చేశారు. తరువాత కొంతకాలానికి సమస్య మళ్లీ రావడంతో 2008లో మరో శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ లోపాల కారణంగా తిరిగి 2013లో మంచం పట్టాడు. ఇంకోసారి ఆపరేషన్ చేయాల్సి వుందని, అందుకు రూ. 2.25 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తేల్చడంతో, అంత డబ్బు లేని ఆ పేద కుటుంబం ముఖ్యమంత్రి సహాయ నిధిని కోరారు. ఫిబ్రవరి 27న సహాయ నిధి నుంచి రూ. 85 వేలు మంజూరు చేస్తున్నట్టు లేఖ రాగా, ఆమొత్తం సరిపోదని బాధితుడి కుమార్తె మరోసారి మొర పెట్టుకోవడంతో, మార్చి 4వ తేదీతో రూ. 2 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఇంకో లేఖ వచ్చింది. దాన్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు అదేమీ కుదరదన్నారు. డబ్బు కానీ, చెక్కు కానీ తెస్తే ఆపరేషన్ చేస్తామని తేల్చి చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రోడ్డునపడింది. ఆ తరువాత ఆసుపత్రి దగ్గర్లోనే సుబ్బరామిరెడ్డి నిర్మించిన ధర్మసత్రంలో కాలం గడుపుతోంది.
అయితే... ఇక్కడ ఇంకో వాదనా వినిపిస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరయ్యే మొత్తానికి చెక్కులు ఇవ్వాలి. కానీ, నిధుల లేమి కారణంగా లేఖలు రాసి ఇస్తున్నారు. అయితే, ఆ తరువాత నిధులు ఇస్తారో లేదో అన్న అనుమానంతో ఆసుపత్రి వర్గాలు ఆ లేఖలను లెక్కలోకి తీసుకోవడం లేదు. చెక్కు తెస్తేనే ఆపరేషన్ చేస్తామంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది రోగులు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన బొర్రా లక్ష్మీనారాణకు తీవ్ర వెన్ను నొప్పి రావడంతో 1995లో విశాఖపట్నంలోని కేజీహెచ్ లో ఆపరేషన్ చేశారు. తరువాత కొంతకాలానికి సమస్య మళ్లీ రావడంతో 2008లో మరో శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ లోపాల కారణంగా తిరిగి 2013లో మంచం పట్టాడు. ఇంకోసారి ఆపరేషన్ చేయాల్సి వుందని, అందుకు రూ. 2.25 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తేల్చడంతో, అంత డబ్బు లేని ఆ పేద కుటుంబం ముఖ్యమంత్రి సహాయ నిధిని కోరారు. ఫిబ్రవరి 27న సహాయ నిధి నుంచి రూ. 85 వేలు మంజూరు చేస్తున్నట్టు లేఖ రాగా, ఆమొత్తం సరిపోదని బాధితుడి కుమార్తె మరోసారి మొర పెట్టుకోవడంతో, మార్చి 4వ తేదీతో రూ. 2 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఇంకో లేఖ వచ్చింది. దాన్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు అదేమీ కుదరదన్నారు. డబ్బు కానీ, చెక్కు కానీ తెస్తే ఆపరేషన్ చేస్తామని తేల్చి చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రోడ్డునపడింది. ఆ తరువాత ఆసుపత్రి దగ్గర్లోనే సుబ్బరామిరెడ్డి నిర్మించిన ధర్మసత్రంలో కాలం గడుపుతోంది.
అయితే... ఇక్కడ ఇంకో వాదనా వినిపిస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరయ్యే మొత్తానికి చెక్కులు ఇవ్వాలి. కానీ, నిధుల లేమి కారణంగా లేఖలు రాసి ఇస్తున్నారు. అయితే, ఆ తరువాత నిధులు ఇస్తారో లేదో అన్న అనుమానంతో ఆసుపత్రి వర్గాలు ఆ లేఖలను లెక్కలోకి తీసుకోవడం లేదు. చెక్కు తెస్తేనే ఆపరేషన్ చేస్తామంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది రోగులు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు.