బీజేపీలో చేరిన కుష్బూ.. హీటెక్కిన తమిళ పాలిటిక్స్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సినీ నటి కుష్బు కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చారు. ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందర ఈ పరిణామం ఆసక్తి రేపుతోంది.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతల సమక్షంలో కుష్బు ఆ పార్టీలో చేరారు.బీజేపీ నేత సంబిత్ పాత్రా.. కుష్బూకు కాషాయం కండువా కప్పి పార్టీ అభ్యర్థిత్వాన్ని అందించారు.
సినీ నటిగా గుర్తింపు పొందిన కుష్బూ ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సామాజిక అంశాలపై గళం ఎత్తుతుంటారు.పార్టీలో కీలక పదవులు కుష్బూకు దక్కాయి.
అయితే ఇటీవల ఆమెను ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి తప్పించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఈ అంశాలతో మనస్తాపానికి గురైన కుష్బూ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పింది.
కాంగ్రెస్ లోని కొందరు నేతలు క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి తెలియకుండానే ఆదేశాలు ఇచ్చారని.. ఇది నచ్చకనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కుష్బూ తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
కుష్బూ రాకతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ మరింత బలోపేతం అవుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలకస్తానం నుంచి పోటీచేస్తారని.. రాష్ట్రంలో బీజేపీ ముఖ చిత్రాన్ని మార్చేస్తారని చెబుతున్నారు. మరి కుష్బూ బీజేపీకి ఎంత కలిసివస్తుందనేది వేచిచూడాలి.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతల సమక్షంలో కుష్బు ఆ పార్టీలో చేరారు.బీజేపీ నేత సంబిత్ పాత్రా.. కుష్బూకు కాషాయం కండువా కప్పి పార్టీ అభ్యర్థిత్వాన్ని అందించారు.
సినీ నటిగా గుర్తింపు పొందిన కుష్బూ ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సామాజిక అంశాలపై గళం ఎత్తుతుంటారు.పార్టీలో కీలక పదవులు కుష్బూకు దక్కాయి.
అయితే ఇటీవల ఆమెను ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి తప్పించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఈ అంశాలతో మనస్తాపానికి గురైన కుష్బూ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పింది.
కాంగ్రెస్ లోని కొందరు నేతలు క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి తెలియకుండానే ఆదేశాలు ఇచ్చారని.. ఇది నచ్చకనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కుష్బూ తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
కుష్బూ రాకతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ మరింత బలోపేతం అవుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలకస్తానం నుంచి పోటీచేస్తారని.. రాష్ట్రంలో బీజేపీ ముఖ చిత్రాన్ని మార్చేస్తారని చెబుతున్నారు. మరి కుష్బూ బీజేపీకి ఎంత కలిసివస్తుందనేది వేచిచూడాలి.