కోమ‌టి జ‌య‌రామ్‌ కు ప్ర‌భుత్వ ప‌ద‌వి

Update: 2016-01-18 16:10 GMT
ప్ర‌ముఖ ఎన్నారై కోమ‌టి జ‌య‌రామ్‌ ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఊహించ‌ని రీతిలో స‌త్క‌రించింది. నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్ర‌త్యేక‌ ప్రతినిధిగా కోమటి జయరామ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. నార్త్ అమెరికా వెళ్లే ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు, అధికారుల‌కు స‌హాయం అంద‌జేయ‌డం, ఆ ప్రాంతంలో నిధులు, సాంకేతిక అంశాలు, ఇత‌ర స‌హాయ స‌హ‌కారాలు అందించడంతో పాటు సంస్కృతిక అంశాల్లో పురోగ‌తికి స‌హ‌క‌రింప‌చేయ‌డం వంటివి ఆయ‌న ఎంపిక‌లో ఇత‌ర బాధ్య‌త‌లుగా ప్ర‌భుత్వం తెలిపింది. ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఎన్నారైలు పెద్ద ఎత్తున హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News