తాలిబన్ల నీచం..మహిళల శవాల్ని కూడా వదిలిపెట్టరట

Update: 2021-08-23 03:36 GMT
విన్నంతనే జుగుప్సాగా అనిపించటమే కాదు.. ఒళ్లంతా కంపరం పుట్టినట్లుగా అవుతుంది. నాగరిక సమాజంలో ఎవరూ చేయనన్నిదారుణాల్ని.. అకృత్యాల్ని చేయటంతో తాలిబన్ల తర్వాతే ఎవరైనా. మహిళల విషయంలో వారెన్ని దారుణాలకు పాల్పడతారో అందరికి తెలిసిందే. అయితే.. తాలిబన్ల గురించి.. వారి క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పుకొచ్చిందో మహిళ. మహిళల్ని సెక్సు యంత్రాలుగా భావించే వారు.. పిల్లల్ని కనే మెషిన్లుగా భావిస్తుంటారు. వారికి మనసు ఉంటుందన్న విషయాన్ని గుర్తించేందుకు సైతం ఇష్టపడరు.

అఫ్గాన్ పోలీసు శాఖలో పని చేసిన ముస్కాన్ అనే పోలీసు అధికారిణి.. తాలిబన్ల నుంచి తప్పించుకొని మన దేశానికి వచ్చేశారు. కాబూల్ ను వారు అక్రమించే వేళలో.. తాలిబన్ పడగనీడ నుంచి తప్పించుకొని వచ్చిన ఆమె.. వారి ఆరాచకాలు ఏస్థాయిలో ఉంటాయో వెల్లడించి అందరిని విస్తుపోయేలా చేసింది. తాలిబన్లు అంటేనే ఆరాచకానికి మారు పేరైనప్పటికీ..వారిలోని ఈ దుర్మార్గపు యాంగిల్ ముస్కాన్ పుణ్యమా అని బయటకు వచ్చిందని చెప్పాలి.

తాలిబన్ల తీరు గురించి చెబుతూ.. ‘‘అరాచకత్వానికి మారుపేరు. మహిళలు చదువుకోకూడదు. మగాళ్ల తోడు లేనిదే గడప దాటకూడదు. బుర్ఖా కచ్చితంగా ధరించాలి. షరియా చట్టాన్ని పాటించాలి. మహిళల్ని సెక్సు బానిసలుగా చూస్తారు. పదేళ్ల బాలికల్ని పెళ్లి చేసుకొని బలవంతంగా అనుభవిస్తారు. అయితే.. ఇప్పటివరకు ఇవి మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ.. వారు అంతకంటే క్రూరులు’’ అని ఆమె షాక్ తినే నిజాన్ని వెల్లడించింది.

చనిపోయిన తర్వాత శవంగా మారిన మహిళల్ని కూడా తాలిబన్లు విడిచిపెట్టరని.. శవంతో కూడా సెక్సు చేస్తారని చెప్పింది.వినటానికే జుగుప్ప కలిగించేలా ఉన్నా.. ఇది నిజమని.. వారెన్ని దారుణాలకు పాల్పడతారో తెలుసా? అంటూ నొక్కి చెబుతోంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉంటున్నారు. తాజాగా ఒక మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. సంచలన నిజాల్ని బయటపెట్టారు.

‘‘మహిళలు ఉద్యోగం చేయకూడదని తాలిబన్లు తేల్చి చెబుతారు. ఒకవేళ ఉద్యోగం చేస్తే.. సదరు మహిళకు మాత్రమే కాదు.. ఆమె కుటుంబానికి ముప్పు పొంచి ఉన్నట్లే. ఒకసారి వార్నింగ్ ఇచ్చాక మళ్లీ ఇవ్వరు. ఆ తర్వాత చంపేయటమే.

నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తారు. మహిళల్ని లైంగికంగా చిత్రహింసలకు గురి చేసి చంపేస్తారు. మరణించిన తర్వాత కూడా వదలరు. డెడ్ బాడీలతో కూడా శృంగారం చేస్తారు. వారు బతికి ఉన్నారా? లేరా? అన్నది వారికి అనవసరం. క్రూర జంతువులకంటే దారుణంగా వ్యవహరిస్తారు. ప్రతి కుటుంబం నుంచి వారికి మహిళలు కావాలి’’ అని చెప్పారు.

తాను చూస్తుండగానే ఒక మహిళను వారు ఎత్తుకెళ్లారని.. ఆమెను చంపేశారని చెప్పారు. ఇలాంటి కారణాలతోనే తాను అఫ్గాన్ ను వదిలేసి.. భారత్ కు వచ్చేసినట్లుగా చెప్పారు. ఇదంతా వింటే.. దరిద్రపుగొట్టు కరోనా ఏదో.. తాలిబన్లకు హోల్ సేల్ గా వచ్చేసి.. నాశనమైపోతే బాగుండని అనిపించట్లేదు?
Tags:    

Similar News