ఫోటో అదిరింది : క్రికెట్ దిగ్గజాల మధ్యన కింజరాపు

Update: 2022-07-18 13:31 GMT
ఆ ఇద్దరు భారత దేశం గర్వించే క్రికెట్ క్రీడాకారులు. ఇద్దరూ ఇద్దరే. ఈ ఇద్దరూ మైదానంలో ఉంటే ఫ్యాన్స్ కేక పెట్టేస్తారు. అలా దశాబ్దాల పాటు తమదైన క్రీడా నైపుణ్యంతో అలరించిన ఆ దిగ్గజాలు ఇపుడు భారత పార్లమెంట్ లో మెరిసాయి. క్రికెట్ జీవితం తరువాత ప్రజా సేవకు తమ జీవితాన్ని అంకితం చేస్తూ గౌతం గంభీర్, హర్భజన్ సింగ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇక గౌతం గంభీర్ అయితే మూడేళ్ల క్రితమే బీజేపీ తరఫున లోక్ సభ అభ్యర్ధిగా ఢిల్లీ నుంచి పోటీ చేసి గెలిచి పార్లమెంట్ లో కొనసాగుతున్నారు. ఇక మరో వైపు చూస్తే ఆప్ తరఫున రాజ్యసభకు హర్ భజన్ సింగ్ లేటెస్ట్ గా నామినేట్ చేయబడ్డారు. ఆయన ఈ రోజు ఎంపీగా ప్రమాణం చేశారు.

ఇక ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లతో ఏపీకి చెందిన యంగ్ లీడర్, శ్రీకాకుళం ఎంపీ అయిన కింజరాపు రామ్మోహననాయుడు పార్లమెంట్ లో ఈ రోజు తీయించుకున్న ఫోటో అయితే అదిరింది అని అంతా అంటున్నారు. అటూ ఇటూ దిగ్గజాలను పెట్టుకుని మధ్యలో నవ్వులు చిందిస్తూ రామ్మోహన్ తీసుకున్న ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది

క్రికెటర్లు సిక్సర్లు కొడుతూ బంతిని బౌండీలు దాటిస్తూ అభిమానులకు హుషారెత్తిస్తారు. రామ్మోహన్ అయితే తన మాటల పదునుతోనే సిక్సర్లు కొడతారు. అధికార పక్షం మీద ధాటీగా విరుచుకుపడాలీ అంటే ఈ యువ ఎంపీ ఉండాల్సిందే అన్న పేరు తెచ్చుకున్నారు.

ఆంగ్ల హిందీ భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించిన రామ్మోహన్ పార్లమెంట్ లో బీజేపీ సర్కార్ ని నిలదీసే విషయంలో ముందుంటారు. ప్రజాసమస్యల ప్రస్థావనలో కూడా తనకు సటి ఎవరూ లేరని చాటుతారు.

అలా దిగ్గజాలకు ఏ మాత్రం తీసిపోని తీరున  పొలిటికల్ ఇమేజ్ ని సాధించిన రామ్మోహన్ క్రికెటర్లు ఇద్దరూ ప్రజా జీవితంలో తమదైన ముద్ర వేయాలని గట్టిగా కోరుకున్నారు. వారు కూడా ప్రజా జీవితంలో సీనియర్ అయిన ఈ యువ ఎంపీతో కలసి నవ్వులు చిందిస్తూ తమకు కూడా రామ్మోహన్ తో ఫోటో షేర్ చేసుకోవడం ఆనందమే అని చెబుతున్నారు.
Tags:    

Similar News