రేప్ కు ముందు అమ్నేషియా పబ్ లో నిందితుల వెకిలి చేష్టలు

Update: 2022-06-07 03:32 GMT
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన గ్యాంగ్ రేప్ నిందితుల ఉదంతం తాలుకు ప్రకంపనలు ఇప్పటికి తగ్గలేదు. ఈ కేసుకు సంబంధించిన కొత్త అంశాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. గ్యాంగ్ రేప్ నిందితుల రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. గ్యాంగ్ రేప్ నకు పాల్పడిన నిందితులు.. ఇమ్నేషియా పబ్ లోనూ తమ వెకిలి బుద్దిని ప్రదర్శించారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా రిమాండ్ రిపోర్టులో ఉన్నట్లుగా చెబుతున్నారు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం .. గ్యాంగ్ రేప్ నకు ముందు పబ్ లోనూ నిందితులు ఇద్దరు బాలికల పట్ల వెకిలి చేష్టలు ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. వీరి చేష్టలతో విసిగిపోయిన ఆ ఇద్దరు బాలికలు మూడో అంతస్తు నుంచి కిందకు వచ్చేసి.. పబ్ బయటకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఒక బాలిక క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. రిమాండ్ రిపోర్టుగా చెబుతున్న దాన్లో పేర్కొన్న అంశాల్ని చూస్తే..

పబ్ కు వచ్చిన బాలికను తొలుత సంగారెడ్డికి చెందిన కార్పొరేటర్ కుమారుడు చూశాడని.. ఆమె పట్ల కాస్తంత దురుసుగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. దీన్ని చూసి సాదుద్దీన్ రెచ్చిపోయాడని చెబుతున్నారు. ఒక బాలిక వీరి చేష్టలతో విసిగిపోయి వెళ్లిపోయింది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే మనమడు ఉమేర్ ఖాన్ బెంజ్ కారులో వచ్చాడు.

బాధితురాలిని చూసి ఆమెతో మాట కలిపేందుకు ప్రయత్నించాడు. ఈ లోపు మరో ఆరుగురు కిందకు వచ్చారు.
ఇంటి వద్ద దింపుతామని చెప్పినా.. మొదట్లో నమ్మలేదని.. ఆ తర్వాత అందరూ ఒత్తిడి తేవటంతో ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. బెంజ్ లో ఉమేర్ ఖాన్.. ఎమ్మెల్యే కొడుకుతో పాటు కార్పొరేటర్ కొడుకు మరో మైనర్ బాధిత బాలిక ఉండగా.. ఇన్నోవాలో సాదుద్దీతో పాటు మిగిలిన వారు ఎక్కారు. దారిలోనే బాధిత బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు.

ఇంతలో బంజారాహిల్స్ రోడ్డు నెంబు 14 కు వెళ్లాక కాన్సు బేకరీలో కేకులు బాగుంటాయని చెప్పి.. తిన్న తర్వాత ఇంటికి వెళదామని పేర్కొన్నారు. బేకరీ నుంచి బయటకు వచ్చాక మళ్లీ పబ్ కు వెళతామని ఒప్పించారని.. అంతకు ముందే అందరూ అత్యాచారం చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. బెంజ్ కారు అయితే అనుకూలంగా ఉండదని.. భావించారు.
ఇందులో భాగంగా కొంత దూరం వచ్చాక బెంజ్ కారులో పెట్రోల్ అయిపోయిందని చెప్పి ఆమెను ఇన్నోవాలో ఎక్కించారు.

అంతలోనే ఎమ్మెల్యే కొడుక్కి ఫోన్ రావటం కిందకు దిగిపోయాడు.మిగిలినవారిలో కొందరు కారులో బయలుదేరి.. బాలికనునిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని పబ్ వద్ద దించేసి.. తిరిగి కాన్సు బేకరి వద్దకు వెళ్లి పార్టీ చేసుకున్నారు. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసి వెళ్లిపోయారు. ఎప్పుడైతే బాధితురాలి తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశారని తెలిసిందే.. ఎవరికి వారు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సాదుద్దీన్ తో పాటు ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
Tags:    

Similar News