నితిన్ మూవీ నుంచి రష్మిక తప్పుకోవడానికి కారణం ఇదేనా?

ఆమె పాత మేనేజర్ కారణంగానే రష్మిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

Update: 2023-07-15 06:06 GMT

ఈ మధ్య స్టార్ హీరోయిన్లకు ఊహించని షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే వెళ్లి పోయింది. ఇప్పుడేమో తాజాగా నితిన్ సినిమా నుంచి రష్మిక కూడా తప్పుకుంది. ఈ మూవీ ని కొంత కాలం క్రితం ప్రకటించారు. డైరెక్టర్ వెంకీ కుడుముల కు ఇది మూడో చిత్రం. గతం లో వెంకీ కుడుముల తీసిన రెండు చిత్రాల్లో రష్మిక నే హీరోయిన్ గా చేసింది. ఛలో భీష్మ ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

మూడో సారి ఈ మూవీ చేస్తున్నామని వారు ప్రకటించారు. దీంతో ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవతుందని మంచి వీడియోతో హైప్ కూడా ఇచ్చారు. అలాంటిది సడెన్ గా ఈ మూవీ నుంచి రష్మిక తప్పుకోవడం గమనార్హం. రష్మికకు డేట్స్ కుదరడం లేదని అందుకే తప్పుకుందని కూడా చెప్పారు. అయితే ఆమె ఆ మూవీ నుంచి తప్పుకోవడాని కి అసలు కారణం తాజాగా బయట కు వచ్చేసింది.

నిజానికి ఈ మూవీ షూటింగ్ లో రష్మిక కొద్ది రోజులు పాల్గొంది. షూట్ లో పాల్గొన్న తర్వాత ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆమె పాత మేనేజర్ కారణంగానే రష్మిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. గతం లో ఆమె మేనేజర్ తో ఆమెకు మనస్పర్థలు వచ్చాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

రష్మిక కి మేనేజర్ గా వ్యవహరించిన కిరణ్ అనే వ్యక్తి ఆమె వద్ద ఆర్థిక మోసానికి పాల్పడ్డాడనే వార్తలు వచ్చాయి. దీని పై రష్మిక ఎప్పుడూ పబ్లిక్ గా మాట్లాడలేదు. కానీ ప్రొఫెషనల్ గా తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించి వివాదానికి ముగింపు పలకాల ని చూశారు. తామిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఏదో గొడవ వల్లే రష్మిక కిరణ్ ని మేనేజర్ గా తొలగించినట్లు ప్రచారం జరిగింది.

అతనే రష్మిక గురించి నిర్మాతలు దర్శకుల వద్ద చెడుగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడట. రష్మిక కు టాలీవుడ్ పై ఆసక్తి లేదని బాలీవుడ్ లో సెటిల్ అవ్వాల ని చూస్తోంది అంటూ ప్రచారం చేశాడట. రష్మిక కు బదులు గా శ్రీలీల మృణాల్ ని తీసుకోవాలని అతను సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం రష్మిక వరకు వెళ్లడంతో ఆమె మనస్థాపానికి గురై ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె స్థానం లో శ్రీలీల ను తీసుకోవడం విశేషం.

Tags:    

Similar News