ఇండోర్ లో దారుణం.. ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి.. గ్యాంగ్ రేప్

ఇండోర్ లో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. తీవ్రమైన నేరాల విషయంలో ఇప్పటివరకు వినిపించని నగరంగా ఉండే ఇండోర్..

Update: 2024-09-12 04:25 GMT

ఇండోర్ లో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. తీవ్రమైన నేరాల విషయంలో ఇప్పటివరకు వినిపించని నగరంగా ఉండే ఇండోర్.. తాజా ఉదంతంతో ఆ మంచి పేరును పోగొట్టుకుంది. స్నేహితురాళ్లతో కలిసి వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై కొందరు దుండగులు దాడి చేయటం ఒక ఎత్తు అయితే..వారిలో ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం సంచలనమైంది. అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో మోవ్ ఆర్మీ కాలేజీలో ఇద్దరు యువ ఆర్మీ అధికారులు శిక్షణ తీసుకుంటున్నారు. తాజాగా వారు తమ స్నేహితురాళ్లతో కలిసి దగ్గర్లోని ఒక పిక్నిక్ స్పాట్ కు వెళ్లారు. అక్కడ వీరిపై గుర్తు తెలియని వ్యక్తులు వీరిపై దాడి చేశారు. వీరి దగ్గర ఉన్న డబ్బుల్ని వారు బెదిరించి తీసేసుకున్నారు. అక్కడితో ఆగని వారు.. ట్రైనీ ఆర్మీ అధికారుల స్నేహితుల్లో ఒకరిని తీసుకెళ్లి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ దాడి నుంచి తప్పించుకున్నఒక ట్రైనీ అధికారి పోలీసుల వద్దకు వెళ్లి సమాచారం ఇచ్చారు. ఆర్మీ అధికారులకు జరిగిన దారుణం గురించి వివరించారు. స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లగా.. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బాధిత మహిళను ఆసుపత్రికి తీసుకెల్లారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా..ఆమెపై అత్యాచారం జరిగిందన్న విషయాన్ని వైద్యులు నిర్దారించారు.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.వీరికి గతంలోనూ క్రిమినల్ రికార్డు ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది.

Tags:    

Similar News