వార్తల్లో హీరో గారి ఆరు అపార్ట్‌మెంట్లు...!

ముంబై కి చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్ సంస్థ ఒబేరాయ్ రియాల్టీ నుంచి అభిషేక్ బచ్చన్‌ ఈ కొనుగోలు చేయడం జరిగిందని తెలుస్తోంది.

Update: 2024-06-20 02:45 GMT

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ సినిమాలతో కంటే ఎక్కువగా ఇతర విషయాల కారణంగా వార్తల్లో నిలవడం మనం చూస్తూ ఉంటాం. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవ్వబోతున్నా కూడా ఇంకా సొంతంగా ఇమేజ్ తెచ్చుకోలేక పోయిన అభిషేక్ బచ్చన్‌ వ్యాపారాల్లో మాత్రం రాణిస్తున్నాడు.

స్పోర్ట్స్ తో పాటు పలు రంగాల్లో పెట్టుబడి పెట్టిన అభిషేక్ బచ్చన్‌ ప్రతి ఏడాది భారీ మొత్తంలో ఆధాయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా అభిషేక్‌ బచ్చన్‌ ముంబైలోని ఖరీదైన ఏరియాలో ఏకంగా ఆరు అపార్టుమెంట్ ఫ్లాట్స్ ను కొనుగోలు చేయడం జరిగిందని బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ముంబై కి చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్ సంస్థ ఒబేరాయ్ రియాల్టీ నుంచి అభిషేక్ బచ్చన్‌ ఈ కొనుగోలు చేయడం జరిగిందని తెలుస్తోంది. అన్ని ఖర్చులతో దాదాపుగా 16 కోట్ల రూపాయలను పెట్టి అభిషేక్ బచ్చన్‌ వాటిని కొనుగోలు చేయడం జరిగిందని బాలీవుడ్‌ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇలాంటి కొనుగోళ్లను ఎక్కువగా చూడలేక పోతున్నాం. అలాంటిది అభిషేక్ బచ్చన్ ఏకంగా ఆరు అపార్ట్‌మెంట్‌ లను కొనుగోలు చేయడం ఖచ్చితంగా పెద్ద వార్త అంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు.

స్కై సిటీ అనే లగ్జరీ ప్రాజెక్ట్‌ లోని 57వ అంతస్తులో ఈ అపార్ట్‌మెంట్‌ ను అభిషేక్ కొనుగోలు చేయడం జరిగిందట. రెండు అపార్ట్‌మెంట్‌ లు 252 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటే, మరో నాలుగు మాత్రం 1100 చదరపు అడుగల విస్తీర్ణంతో ఉంటాయట.

అభిషేక్ బచ్చన్ సినిమాల్లో పెద్దగా హిట్స్ దక్కించుకోలేక పోయినా కూడా ఆయన భార్య ఐశ్వర్య రాయ్ మరియు తండ్రి అమితాబచ్చన్‌ మాత్రం బిజీ బిజీగా సినిమాలు చేస్తూ ఏడాదికి పదుల కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.

Tags:    

Similar News