ఆ ఇంట్లో ఏదో ఉందంటూ ఆదాశ‌ర్మ సంచ‌ల‌న ఆరోప‌ణ!

ఇటీవ‌లే కుటుంబంతో అదే ఇంట్లోకి ఆదాశ‌ర్మ ఫ్యామిలీ షిప్ట్ అయింది.

Update: 2024-10-15 07:32 GMT

బాలీవుడ్ న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంటిని ఆదాశ‌ర్మ కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. అదే ఇంట్లో సుషాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి చ‌నిపోయాడు. అయినా దైర్యంగా ఇంకే విష‌యాలు ప‌ట్టిం చుకోకుండా ఆదాశ‌ర్మ కొనుగోలు చేసి రీమోడ‌లింగ్ చేయించింది. ఇటీవ‌లే కుటుంబంతో అదే ఇంట్లోకి ఆదాశ‌ర్మ ఫ్యామిలీ షిప్ట్ అయింది. ఈ నేప‌థ్యంలో ఆదాశర్మ ఆ ఇంటిని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.


'నాకు ఈ ఇల్లు ఎంతో న‌చ్చింది. మా అమ్మ‌, అమ్మ‌మ్మ‌తో అదే ఇంట్లో ఉంటున్నాను. కానీ ఆ ఇంట్లో ఏదో తెలియ‌ని శ‌క్తి ఉంది`అని అంది. దీంతో ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఆదాశ‌ర్మ కావాలనే అలాంటి వ్యాఖ్య‌లు చేసింద‌ని నెటి జ‌నులు పోస్టులు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు వీటిపై స్పందించింది. `న‌టిగా నేను చేయాల్సిన ప‌నులు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిని ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు.

అభిప్రాయాలు తెల‌ప‌డానికి మ‌న దేశంలో పూర్తి స్వేచ్ఛ ఉంది. నేను ఆ ఇంటిని కొనుగోలు చేసే స‌మ‌యంలో ఎవ‌రి అభిప్రాయాలు వారు చెప్పారు. కానీ నేను మంచి వ్య‌క్తిని అని రుజువు చేసుకోవాల్సిన ప‌నిలేదు. నాకు చేయాల‌నిపించింది చేసాను. నాకోసం ఎవ‌రూ మార‌కూడ‌ద‌ని అనుకుంటాను. అదే రూల్ ఇత‌రుల‌కు వ‌ర్తిస్తుంది.

వారి కోసం నేను నా ప‌ద్ద‌తి మార్చుకోను' అని అంది. ఆ ఇంటి గురించి ఆదాశర్మ ఇలా మాట్లాడ‌టం తొలిసారి కాదు. గ‌తంలోనూ ఇలాంటి వ్యాఖ్య‌లు చేసింది. అప్ప‌టికి అమ్మ‌డు ఆ ఇంట్లో గృహ ప్ర‌వేశం చేయ‌లేదు.

Tags:    

Similar News