పెళ్లిలో కుటుంబానికి దూరంగా ఐశ్వ‌ర్యారాయ్?

ఆ పెద్దింటి కోడ‌లు ఇలా కుటుంబంతో కాకుండా ఒంట‌రిగా, విడిగా కెమెరాల‌కు ఫోజులివ్వ‌డం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-07-13 12:32 GMT

భర్త & కుటుంబం నుండి విడివిడిగా కెమెరాకు పోజులిచ్చిన ప్ర‌ముఖ‌ హీరోయిన్ గురించి.. ఆమె కూతురు గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది! అత్త గారు, ఆడ‌ప‌డుచుతో అంత‌గా పొస‌గ‌ద‌నే టాక్ న‌డుమ‌.. ఆ పెద్దింటి కోడ‌లు ఇలా కుటుంబంతో కాకుండా ఒంట‌రిగా, విడిగా కెమెరాల‌కు ఫోజులివ్వ‌డం హాట్ టాపిక్ గా మారింది.

అనంత్ అంబానీ- రాధికా మ‌ర్చంట్ ల‌ వివాహానికి వచ్చిన అమితాబ్ బచ్చన్ .. ఆయ‌న‌ కుటుంబం, కోడ‌లు ఐశ్వర్య రాయ్ లేకుండా గ్రూప్ ఫోటోకి పోజులిచ్చారంటూ హిందీ మీడియా కోడై కూస్తోంది. జాతీయ మీడియాలో ఈ వార్త వైర‌ల్ గా షేర్ అవుతోంది. పెళ్లిలో బచ్చన్ కుటుంబంలో క‌లిసి ఐష్ క‌నిపించ‌లేదంటూ ఒక‌టే హ‌డావుడి క‌నిపించింది.

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ తదితరులు ఫ్యామిలీ ఫోటో కోసం పోజులిచ్చారు.. కానీ ఐశ్వర్య రాయ్ ఆ ఫ్రేమ్‌లో లేరు... కుమార్తె ఆరాధ్యతో ఐష్‌ కెమెరా క‌ళ్ల‌కు క‌నిపించింది. ఈ వీడియోలో అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్‌తో కలిసి పోజులిచ్చేందుకు సిద్ధం అవుతూ క‌నిపించారు. మెగాస్టార్ తన మిగిలిన కుటుంబ సభ్యులను త‌మ‌తో చేరమని సైగ చేస్తున్నప్పుడు వారంతా కెమెరాకు పోజులిచ్చారు. అప్పుడు వారి కుమారుడు అభిషేక్ బచ్చన్, కుమార్తె శ్వేతా నందా, ఆమె వ్యాపారవేత్త భర్త నిఖిల్ నందా, వారి పిల్లలు, నవ్య నవేళి నందా, ది ఆర్చీస్ స్టార్ అగస్త్య నంద చేరారు. అయితే, గొప్ప బచ్చన్ కుటుంబ ఫోటో కోసం ఐశ్వర్య రాయ్ బచ్చన్ వారితో పోజ్ ఇవ్వ‌కపోవడంతో నెటిజనుల్లో సందేహం రేకెత్తించింది. తరువాత త‌న కుమార్తెతో క‌లిసి ఒక ప్ర‌త్యేక ప్ర‌దేశానికి వెళ్లి ఐశ్వ‌ర్యారాయ్ కెమెరాల‌కు ఫోజులివ్వ‌డం అక్క‌డ క‌నిపించింది. కుటుంబం లేకుండా ఐష్ కేవ‌లం కూతురితో మాత్ర‌మే క‌నిపించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఐశ్వర్య తన కూతురు ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ఫోటో ఏరియాకి వచ్చింది. ఆ ల‌వ్ లీ క్షణంలో, ఐశ్వర్య.. తన 12 ఏళ్ల కుమార్తె ఆరాధ్య‌కు మీడియా గ్లేర్ ఎదుర్కోవ‌డంలో మార్గనిర్దేశం చేయడం కనిపించింది. ఆరాధ్య ఆ తర్వాత ఫ్రేమ్ నుండి నిష్క్రమించింది. అటుపై కెమెరాల‌ కోసం ఐష్‌ ఒంటరిగా పోజులిచ్చింది.

ఈ వేదిక వ‌ద్ద త‌న కుటుంబంతో కాకుండా సీనియ‌ర్ న‌టి రేఖ‌తో ఐష్ స‌న్నిహితంగా ఉన్నారని మీడియాలు క‌థ‌నాలు అల్లాయి. సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందు ఐశ్వర్య రాయ్ రేఖను కలుసుకున్నారు. సీనియ‌ర్ న‌టీమ‌ణిని ఆప్యాయంగా పలకరించింది. ఆరాధ్యను రేఖ‌ ముద్దు పెట్టుకుంది. ఐశ్వర్య - రేఖ క్లుప్తంగా మాట్లాడుకున్నారు. అనంత‌రం మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ రెడ్ కార్పెట్‌పైకి వెళ్లారు.

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ముంబైలో వివాహం చేసుకున్నారు. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ.. ప్రపంచం నలుమూలల నుండి హాజరైన ప్రముఖులు .. ప్రపంచవ్యాప్తంగా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌లను నిర్వహించిన తర్వాత ఘ‌న‌మైన పెళ్లి ఇది. అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ కిమ్ కర్దాషియాన్ , ఆమె సోదరి ఖోలో కర్దాషియాన్, జాన్ సెనా .. రాపర్ రెమా కూడా అంబానీల‌ వివాహానికి హాజరయ్యారు. ఈ సంవత్సరం మార్చిలో జామ్‌నగర్‌లో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో దాదాపు 1200 మంది అతిథులు పాల్గొన్నారు. బిల్ గేట్స్, హిల్లరీ క్లింటన్, జారెడ్ కుష్నర్, ఇవాంకా ట్రంప్, కార్లీ క్లోస్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి అతిథులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో రిహన్న ఎనిమిదేళ్లలో తన మొట్టమొదటి సంగీత కచేరీని ప్రదర్శించింది. ఈ ఫంక్షన్‌కు హాజరైన వారిలో దిల్జిత్ దోసాంజ్ కూడా ఉన్నారు. కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కోసం ఏకంగా ముఖేష్ అంబానీ ఏకంగా 5000 కోట్లు ఖ‌ర్చు చేస్తుండ‌డం సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌పంచంలో ఏ ఇత‌ర కుభేరుడి కుమారుని పెళ్లి ఇంత ఘ‌నంగా జ‌ర‌గ‌లేదు.

Tags:    

Similar News