పవన్ సినిమా... దానికోసం అకీరా ఎదురు చూపులు

చంద్రబాబు తో పవన్ కలిసిన సమయంలో అకీరా ఉన్నాడు. ఇలా ప్రతి ముఖ్యమైన సమయంలో కూడా పవన్ పక్కన అకీరా ఉన్న విషయం తెల్సిందే

Update: 2024-07-01 06:18 GMT

మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్‌ ఏ స్థాయిలో వార్తల్లో నిలిచాడో అదే స్థాయిలో ఆయన తనయుడు అకీరా నందన్ వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. పవన్‌ విజయం కన్ఫర్మ్‌ అయినప్పటి నుంచి అకీరా సందడి మొదలైంది. మోదీ వద్దకు పవన్ వెళ్లిన సమయంలో అకీరా ఉన్నాడు.

చంద్రబాబు తో పవన్ కలిసిన సమయంలో అకీరా ఉన్నాడు. ఇలా ప్రతి ముఖ్యమైన సమయంలో కూడా పవన్ పక్కన అకీరా ఉన్న విషయం తెల్సిందే. అందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఎంతగా వైరల్‌ అయ్యాయో చూశాం. ఇప్పుడు అకీరా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్ల్ అడివి శేష్‌ అంటే అకీరాకి అత్యంత అభిమానం. ఆ విషయం అందరికి తెలిసిందే. అకీరా మరియు అడివి శేష్ మధ్య చక్కని అనుబంధం ఉంది. ఇద్దరు మంచి స్నేహితులుగా, అన్నదమ్ముళ్లు గా కలిసి ఉంటారు అంటూ వారి వారి సన్నిహితులు చెప్పడం జరిగింది.

తాజాగా అకీరా గురించి అడివి శేష్‌ ఒక ఆసక్తికర విషయాన్ని వెళ్లడించాడు. తాజా చిట్ చాట్ లో అడివి శేష్ మాట్లాడుతూ... పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న సినిమాల్లో ఓజీ అంటే అకీరాకి చాలా ఇష్టం. తన తండ్రి పవన్‌ కళ్యాణ్‌ ను గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఎప్పుడెప్పుడు చూస్తానా అంటూ అకీరా ఎదురు చూస్తున్నాడు.

సాహో సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా షూటింగ్‌ ఇప్పటికే దాదాపు సగం పూర్తి అయ్యిందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం రాజకీయాలు, పరిపాలనతో బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ కెమెరా ముందుకు రావడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.

సుజీత్‌ దర్శకత్వంలో పవన్ ఓజీ పూర్తి అవ్వాలంటే చాలా రోజులు పట్టే అవకాశం ఉంది. కనుక అకీరా ఓజీ సినిమా కోసం ఇంకా చాలా రోజులు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. పవన్ కి గ్యాంగ్‌స్టర్ మూవీస్ అంటే ఇష్టం. అకీరాకి కూడా అవే ఇష్టం. కనుక ఇద్దరు కలిసి భవిష్యత్తులో గ్యాంగ్‌స్టర్ మూవీ చేస్తే ఓ అద్భుతం అన్నట్లుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News