జానీ మాస్టర్ భార్య అరెస్టుకు రంగం సిద్ధం!... ఈ రెండో కేసే కారణం!?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-21 14:37 GMT

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. అత్యాచారం చేశాడని.. ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనంగా మారింది.

ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ పోలీసులు.. జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేశారు! అనంతరం హైదరాబాద్ కు తీసుకురావడం, కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో... జానీ మాస్టర్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో... అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.

ఆ సంగతి అలా ఉంటే... ఇదే వ్యవహారంపై బాధితురాలు.. జానీ మాస్టర్ భార్య అయేషాపైనా ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా... మతం మారాలని, మారి తన భర్తను పెళ్లి చేసుకోవాలంటూ అయేషా తనను వేధించిందని.. ఈ క్రమంలో తనపై పలుమార్లు భౌతిక దాడికి పాల్పడిందని బాధితురాలు ఫిర్యాదు చేసిన పరిస్థితి.

అయితే... తాజాగా జానీ మాస్టర్ భార్యపై మరో విషయంలోనూ కేసు నమోదైందని అంటున్నారు. ఇందులో భాగంగా... బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు అయేషా ప్రయత్నించిందని అంటున్నారు. ఈ కారణంతోనే అయేషాపై మరో కేసు నమోదయ్యిందని తెలుస్తోంది. దీంతో.. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.

కాగా.. అత్యాచార ఆరోపణలతో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ కేసులో సైబరాబాద్ పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టినట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తనవద్ద పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతిపై నాలుగేళ్లపాటు అతడు అఘాయిత్యానికి పాల్పడినట్లు నిర్ధారించారని అంటున్నారు.

ఈ విషయం బయటపెడితే అవకాశాలు దొరక్కుండా చేస్తానని బెదిరించి లొంగదీసుకున్నట్లు ఉప్పరపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఆయన భార్యను అరెస్టుకు కూడా రంగం సిద్ధమైనట్లు కథనాలొస్తున్నాయి!

Tags:    

Similar News