బిగ్‌ బాస్‌ లో ఆ న‌లుగురిదే గేమ్‌ వాళ్లు విడిపోవాలంటోన్న ఆలీ

Update: 2019-09-28 04:47 GMT
ఎవరు ఊహించని విధంగా ఆరోవారంలో బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన అలీ గురువారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ హౌస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక అలీ రావడమే శుక్రవారం ఎపిసోడ్‌ లో బయట ఏం జరుగుతుందో హౌస్ మేట్స్ కు చెప్పే ప్రయత్నం చేశాడు. అటు బయట ఏం జరిగిందో మనం పట్టించుకోకూడదని వితికా - శ్రీముఖి చర్చలు చేసుకున్నారు. వీరికంటే ముందు రవి - జ్యోతిలు అలీని తిరిగి ఇంట్లోకి పంపినందుకు బిగ్ బాసుకు థాంక్స్ చెప్పుకున్నారు.

అలాగే అలీకి బయట ఏం జరుగుతుందో అన్నీ తెలుసని - వాడు ఇంకా స్ట్రాటజీ గా గేమ్ ఆడతాడని రవి...జ్యోతికి వివరించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ నుంచే అసలు మజా మొదలవుతుందని అన్నాడు. అటు మొన్న టాస్క్ లో రాహుల్-వరుణ్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఆ గొడవ గురించి వరుణ్, -రాహుల్ సెపరేట్ గా అలీకి చెప్పుకున్నారు. ఆ గొడవ తర్వాత ఇంట్లో పునర్నవి-రాహుల్  ఒంటరైపోయారు. అందరూ ఒకచోట ఉంటే ఈ ఇద్దరు మాత్రం సెపరేట్ గా ఉంటున్నారు.

ఇక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన అలీ బయట బిగ్ బాస్ ఎలా నడుస్తుందో...ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారో రవి - జ్యోతి - బాబా భాస్కర్ లకు చెప్పే ప్రయత్నం చేశాడు. బయట అందరూ పునర్నవి - వితికా - వరుణ్ - రాహుల్ ఈ నలుగురిదే ఆట అనుకుంటున్నారని - ఆ నలుగురు ఉంటే గేమ్ ఉంటుందని - వాళ్లు విడిపోతే ఎవరూ ఉండరని చెప్పాడు. ఇకపై బిగ్ బాస్ హౌస్‌ లో మనం ఆడటానికి ఏం లేదని - అంతా బిగ్ బాస్ ఆడతాడని వివరించాడు.

బయటకెళ్ళి వచ్చిన వ్యక్తి చెప్పే విషయాలని మనం వినకూడదని. అవి వింటే గేమ్ మొత్తం పోతుందని శ్రీముఖి - వితికాకు చెప్పే ప్రయత్నం చేసింది. మన గురించి పాజిటివ్ గా ఉన్న - నెగిటివ్ గా ఉన్న అతని మాటలు వినకూడదని వితికాకు గీతోపదేశం చేసింది.


Tags:    

Similar News