బాలీవుడ్ వెబ్ సిరీస్ వైపు మెగా హీరోల భామ!

Update: 2020-05-01 06:45 GMT
తెలుగు చిత్రపరిశ్రమలోకి 'బెజవాడ' సినిమా ద్వారా పరిచయమైంది నటి అమలాపాల్. చేసింది త‌క్కువ సినిమాలే అయినా కూడా తన నటనతో, అందాల విందుతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. రామ్ చ‌ర‌ణ్ తో 'నాయక్' - అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మెగా హీరోలతో నటించినా ఎందుకో కానీ తెలుగులో చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు మాత్రం రాలేదు. దీంతో త‌మిళ‌ - మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌పై దృష్టి పెట్టింది ఈ భామ‌. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. ఎందుకోగానీ వీరి బంధం ఎక్కువకాలం నిలబడలేదు.

ఆ తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తీసుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. విఐపి2, ఆమె చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా మంచి పేరును తెచ్చి పెట్టాయి.

ఇదిలా ఉండగా తాజాగా అమలాపాల్ ఒక వెబ్ సిరీస్ లో నటించబోతోందంటూ ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమా అంటే థియేటర్స్ లోనే చూడాలి అనే రోజులు పోయాయి. కరోనా దెబ్బతో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగింది. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే దృష్టి పెడుతున్నారు. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో పెద్ద పెద్ద నిర్మాతలు, స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ రంగం వైపు చూస్తున్నారు. అయితే అమలాపాల్ కూడా వెబ్ సిరీస్ లో నటించబోతుందట. హిందీలో మహేష్ భట్, జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో ఆమె నటిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్‌లో నటించాలన్న తన కల తీరుతున్నందుకు అమలాపాల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుందట. ఇక ఇప్పటికే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, సమంతలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే అమలాపాల్ కూడా అడుగులు వేస్తోంది. చూడాలి మరి డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అయినా అమలాపాల్ సక్సెస్ అందుకుంటుందేమో..!
Tags:    

Similar News