రష్మికకు షాక్ ఇచ్చిన బాలీవుడ్ మేకర్స్..!

Update: 2022-11-18 06:04 GMT
కన్నడ భామ రష్మిక బాలీవుడ్ లో మొదట సైన్ చేసిన సినిమా మిషన్ మజ్ను. సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను శంతను బాగ్చీ డైరెక్ట్ చేస్తున్నారు. రష్మిక ఫస్ట్ సైన్ చేసినా సరే ఈ సినిమా లేట్ అయ్యి అమితాబ్ తో నటించిన గుడ్ బై సినిమా రిలీజైంది. మిషన్ మజ్ను సినిమా స్పై థ్రిల్లర్ కథాంశంతో వస్తుంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాదనుకుని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

బాలీవుడ్ లో ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు గట్టెక్కలేని పరిస్థితుల్లో స్పై థ్రిల్లర్ కాబట్టి రెగ్యులర్ సినిమా అనుకుని థియేటర్ రిలీజ్ వద్దనుకున్నారో ఏమో కానీ మిషన్ మజ్ను సినిమాని నెట్ ఫిక్స్  రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే బాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలని అనుకుంటున్న రష్మిక ఆశలకు ఇది బ్రేక్ వేసేలా ఉంది. మిషన్ మజ్ను ఓటీటీ రిలీజ్ అవగా అది అంతగా రష్మిక కెరియర్ కు ఉపయోగపడే అవకాశం లేదు. మిషన్ మజ్ను టీం తీసుకున్న ఈ నిర్ణయంపై రష్మిక అప్సెట్ లో ఉంది.

ఈ మూవీ తర్వాత రష్మిక సందీప్ వంగ డైరక్షన్ లో యానిమల్ మూవీలో నటిస్తుంది. రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ పైనే రష్మిక ఆశలన్నీ పెట్టుకుంది. మిషన్ మజ్ను ఎలాగు ఓటీటీ రిలీజ్ కాబట్టి దాని ఫలితంతో సంబంధం ఉండదు. కానీ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ చేస్తున్న యానిమల్ సినిమా మాత్రం అమ్మడికి లక్ కలిసి వచ్చేలా ఉంది.

మరోపక్క తెలుగు, తమిళ భాషల్లో కూడా రష్మిక దూసుకెళ్తుంది. ఆమె చేస్తున్న సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతుండటంతో సౌత్ లో అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. పుష్ప 2 సినిమాలో రష్మిక భాగం కానుంది. ఆ సినిమాతో కూడా మరోసారి రష్మిక తన సత్తా చాటుతుందని చెప్పొచ్చు. నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్ సినిమాల విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్లాలని చూస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News