చంద్ర‌బాబు తో వీర‌సింహా రెడ్డి డైరెక్ట‌ర్ మెమొర‌బుల్ మూమెంట్

ఈ పార్టీకి నంద‌మూరి, నారా కుటుంబీకుల‌తో పాటూ వారి ద‌గ్గ‌రి బంధువులు కూడా హాజ‌ర‌య్యారు. పార్టీలో బాల‌య్య‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు, లోకేష్ మాట్లాడిన మాట‌లు హైలైట్ అయ్యాయి.

Update: 2025-02-02 11:21 GMT

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల్లో బాల‌కృష్ణ క్రేజ్ సినిమా సినిమాకీ పెరుగుతుంది. వ‌రుస హిట్ల‌తో ఫుల్ జోష్ లో ఉన్న బాల‌కృష్ణ ఫ్యాన్స్ కు త‌న సినిమాల‌తోనే కాకుండా రీసెంట్ గా కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారానికి ఎంపికై ఆ విధంగా కూడా ట్రీట్ ఇచ్చాడు. అన్న‌య్య‌కు ద‌క్కిన గొప్ప పుర‌స్కారానికి త‌న చెల్లెలు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు భార్య నారా భువ‌నేశ్వ‌రి భారీ పార్టీని అరేంజ్ చేసింది.


ఈ పార్టీకి నంద‌మూరి, నారా కుటుంబీకుల‌తో పాటూ వారి ద‌గ్గ‌రి బంధువులు కూడా హాజ‌ర‌య్యారు. పార్టీలో బాల‌య్య‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు, లోకేష్ మాట్లాడిన మాట‌లు హైలైట్ అయ్యాయి. ఈ పార్టీకి నంద‌మూరి, నారా ఫ్యామిలీలు హాజ‌ర‌వ‌గా హ‌రికృష్ణ కొడుకులైన జూ. ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ మాత్రం హాజ‌రు కాలేదని తెలుస్తోంది.

భారీ సంఖ్య‌లో గెస్టులు హాజ‌రైన ఈ పార్టీలో అంద‌రూ నారా, నంద‌మూరి కుటుంబాల‌కు చెందిన వారే అని స‌మాచారం. ఇక సినీ ఇండ‌స్ట్రీ నుంచి మాత్రం చాలా త‌క్కువ మందికే ఈ పార్టీకి ఆహ్వానం వెళ్లింది. వారిలో అఖండ‌, వీర సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి, డాకు మ‌హారాజ్ ద‌ర్శ‌కుల‌కు, నిర్మాత‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. పార్టీకి ఆయా సినిమాల ద‌ర్శ‌క‌నిర్మాత‌లు హాజ‌రైన‌ట్టు తెలుస్తోంది.

అయితే ఈ పార్టీకి వెళ్లిన వారిలో బాల‌య్య‌తో సూప‌ర్ హిట్ అందుకున్న వీర సింహారెడ్డి డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కూడా ఉన్నాడు. పార్టీకి వెళ్లిన గోపీచంద్ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి ఫోటో దిగి దాన్ని నెట్టింట షేర్ చేసుకున్నాడు. చంద్ర‌బాబు గారితో ఓ మెమొర‌బుల్ ఈవెనింగ్ చాలా ఆనందాన్ని క‌లిగించింద‌ని ఆయ‌న తెలిపాడు.

కాగా గోపీచంద్ మ‌లినేని ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ హీరో స‌న్నీ డియోల్ హీరోగా జాత్ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకుని బాలీవుడ్ లో సెటిల‌వాల‌ని చూస్తున్నాడు గోపీచంద్. మ‌రి జాత్ త‌న‌కు ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.

Tags:    

Similar News