వీడియో: బాత్రూంలో కియారాతో ఈ పనేంటి విజయ్..?

Update: 2022-11-02 08:00 GMT
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న వీడీ.. తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో చాలా త్వరగా నార్త్ సర్క్యూట్స్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు.

హిందీ సినిమా లేదా పాన్ ఇండియా చిత్రం చేయకముందే బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన విజయ్'D.. 'లైగర్' మూవీతో నేషనల్ వైడ్ షేక్ చేయాలని భావించాడు. అయితే ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం అతనికి నిరాశనే మిగిల్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.

అయినప్పటికీ VD క్రేజ్ మరియు బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. పలు పెద్ద కంపెనీలు రౌడీ స్టార్ ని తమ బ్రాండ్ అంబాసిడర్‌ గా నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా సెరా ఇండియా బ్రాండ్ కోసం విజయ్ దేవరకొండ నటించిన కమర్షియల్ యాడ్ ని రిలీజ్ చేసారు.

ఈ ప్రకటనలో విజయ్ తో పాటుగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా స్టైలిష్ గో-గ్రీన్ బాత్రూంలో VD ఒక ఎర్ర గులాబీతో కియారాకి ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ఇద్దరూ కలర్ ఫుల్ ట్రెండీ క్యాస్టూమ్స్ లో చాలా స్టైలిష్ గా కనిపించారు. యాడ్ కూడా చాలా స్టైలిష్‌ గా ఉంది. శానిటరీవేర్ బ్రాండ్‌ కు తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేయబడింది.

ఈ వాణిజ్య ప్రకటనను విజయ్ దేవరకొండ యూట్యూబ్ లో షేర్ చేస్తూ.. 'డాజ్లింగ్ దివా కియారా ఆద్వానీ మాదిరిగానే నా స్టైల్ ని నా మార్గంలో నేను నిర్వచించుకుంటాను. నా స్పేస్ నా వైబ్‌ కి ఎలా పర్యాయపదంగా ఉందో చూడండి. మీ బాత్రూమ్ స్పేస్ ని సెరా సానిటరీవేర్, కుళాయిలు మరియు టైల్స్‌ తో మీరు ఎవరో ప్రతిబింబించనివ్వండి' అని పేర్కొన్నారు.

సెరా ఇండియాకి కియారా అద్వానీ మరియు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో వీరిద్దరూ ఒక ప్రీమియం వెడ్డింగ్ బట్టల బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే.

యాదృచ్ఛికంగా, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమా హిందీ రీమేక్ గా తెరకెక్కిన 'కబీర్ సింగ్‌' లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు సెరా యాడ్ లో విజయ్ - కియారా జోడీ బాగుండటంతో.. బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ ప్రస్తుతం సమంత రూత్ ప్రభుతో కలిసి 'ఖుషి' వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. అయితే 'జనగణమన' హోల్డ్ లో పడిన తర్వాత వీడీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై క్లారిటీ రావడం లేదు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి మరియు హరీష్ శంకర్ లతో రౌడీ సినిమాలు చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.

కియారా అద్వానీ విషయానికొస్తే.. 'భరత్ అనే నేను' వంటి బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. వెంటనే 'వినయ విధేయ రామ' చిత్రంతో ప్లాప్ అందుకుంది. ఆ తర్వాత అమ్మడిని తెలుగులోకి తీసుకురావాలని పలువురు ఫిలిం మేకర్స్ ట్రై చేసారు కానీ.. కుదరలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News