స్టార్‌ హీరో స్మైలింగ్ సెల్ఫీ వైరల్‌

Update: 2022-11-30 15:30 GMT
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఆయన నుండి ఒక బిగ్ కమర్షియల్‌ సక్సెస్ కోసం వెయిట్‌ చేశారు. ఎట్టకేలకు పొన్నియిన్‌ సెల్వన్ సినిమా తో బిగ్‌ కమర్షియల్‌ దక్కింది. ఆ కమర్షియల్‌ సక్సెస్ ఇచ్చిన జోష్ తో ప్రస్తుతం విక్రమ్‌ తంగలన్ అనే పాన్‌ ఇండియా సినిమా ను చేస్తున్నారు. సినిమా ప్రకటించిన సమయంలోనే పాన్ ఇండియా రేంజ్ లో ఆసక్తిని రేకెత్తించింది.

తంగలన్ సినిమా లో విక్రమ్‌ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. విభిన్న చిత్రాల దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈయన దర్శకత్వంలో సినిమా అంటే మినిమం ఉంటుందని అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. తెలుగు లో కూడా పా రంజింత్‌ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.

విక్రమ్‌ సినిమా యొక్క అప్ డేట్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో తంగలన్ సెట్‌ నుండి ఈ సెల్ఫీ ని విక్రమ్‌ షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో విక్రమ్‌ కు జోడీగా మలయాళి ముద్దుగుమ్మ పార్వతి తిరువోతు నటిస్తున్న విషయం తెల్సిందే.

హీరో విక్రమ్‌ ఇంకా దర్శకుడు పా రంజిత్ మరియు హీరోయిన్ పార్వతి తీసుకున్న ఈ సెల్ఫీ ప్రస్తుతం తమిళ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముగ్గురు కూడా చిరు నవ్వు నవ్వుతూ సినిమా చాలా బాగా వస్తుందని చెప్పకనే చెబుతున్నట్లుగా ఉంది అంటూ విక్రమ్‌ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఇంకా ఈ సినిమాలో మాళవిక మోహనన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక వైపు విక్రమ్‌ తనయుడు ధృవ్‌ వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో ఈయన కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News