జనాలకు దూరంగా స్టార్‌ కపుల్‌ కొత్త ఇల్లు..!

Update: 2022-12-07 13:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ దీపికా పడుకునే.. రణ్వీర్ సింగ్ జోడీ గురించి మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ బాలీవుడ్‌ జోడీ గురించి జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి.

ముఖ్యంగా వీరిద్దరు తమ ఏకాంతం కోసం ఏకంగా 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అత్యంత విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారట.

ముంబై మహా నగరానికి దాదాపు రెండు గంటల దూరంలో తమ కొత్త ఇంటిని దీపికా మరియు రణ్వీర్ సింగ్ లు తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ ఇల్లు మరియు మొత్తం స్థలం కలిపి పదుల ఎకరాల్లో ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.

తాజాగా తమ కొత్త ఇంటిని గురించి దీపికా పడుకునే భర్త రణ్వీర్ సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ.. మా యొక్క సమయమును చక్కగా గడపడానికి ఇది ఒక మంచి ప్రదేశంగా మేము భావించాం. ప్రస్తుతం ఈ కొత్త ఇంటికి సంబంధించిన వర్క్ ను దీపికా తన మనసు పెట్టి చేస్తుందని పేర్కొన్నాడు.

దీపికా పడుకునే మరియు రణ్వీర్ సింగ్ మాత్రమే కాకుండా ఇంకా పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు మరియు వ్యాపారవేత్తలు కూడా సిటీకి వందల కిలోమీటర్ల దూరంలో తమ ఇళ్ల నిర్మాణం చేసుకుంటూ ఉన్నారట.

వారాంతంలో లేదా ప్రత్యేక రోజుల్లో అక్కడ గడిపేందుకు.. విశ్రాంతి తీసుకునేందుకు నగర శివారులో ఉన్న ఇల్లులను సెలబ్రెటీలు వినియోగించుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి.
Tags:    

Similar News