ఆ మూడిట్లో ఒక్కటైనా పట్టాలెక్కేనా...?

Update: 2020-05-28 05:30 GMT
సౌత్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు గౌతమ్ వాసుదేవ్ మీనన్. లవ్ స్టోరీస్ తో పాటు యాక్షన్ సినిమాలను కూడా అద్భుతంగా తెరకెక్కించగలడని గౌతమ్ మీనన్ కి మంచి గుర్తింపు ఉంది. అటు కోలీవుడ్ లో మరియు మన టాలీవుడ్ లో కూడా వైవిధ్య చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 'కాక్క కాక్క' 'విన్నైతాండి వరువాయా' 'మిన్నలే' ఇలా విజయవంతమైన చిత్రాలు ఈయన దర్శకత్వంలో వచ్చినవే. తన సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. మన తెలుగు ప్రేక్షకులకు ఈయన పేరు చెప్పగానే 'ఏమాయ చేసావే' 'ఘర్షణ' 'రాఘవన్' 'సాహసం శ్వాసగా సాగిపో' 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' 'ఎటో వెళ్లిపోయింది మనసు' 'ఎంతవాడు గానీ' చిత్రాలు గుర్తొస్తాయి. గౌతమ్ మీనన్ సినిమాలు స్లో పాయిజన్ లా ఎక్కుతాయని మన టాలీవుడ్ ప్రేక్షకులు కూడా వాటిపై ఆసక్తి కనబరుస్తారు. అయితే ఈ మధ్య సినిమాలు కొంచెం గ్యాప్ ఇచ్చిన గౌతమ్ మీనన్ 'క్వీన్' వెబ్ సిరీస్ తో అలరించాడు. అంతేకాకుండా 'కనులు కనులను దోచాయంటే' సినిమాలో కీలక పాత్రలో నటించి తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసాడు.

ఇదిలా ఉండగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తాను తీసిన మూడు వైవిధ్యమైన సినిమాలకు సీక్వెల్స్ రెడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'రాఘవన్'.. అక్కినేని నాగ చైతన్య - సమంతల కాంబోలో తెరకెక్కించిన అద్భుతమైన లవ్ స్టోరీ 'ఏమాయ చేసావే'.. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో 'తలా' అజిత్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎంతవాడు గాని'. ఈ మూడు సినిమాల సీక్వెల్స్ కోసం గౌతమ్ మీనన్ ఇప్పటికే స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నారట. మరి ఈ మూడింటిలో ఏ ప్రాజెక్ట్ ముందుగా పట్టాలెక్కిస్తాడో చూడాలి. ఏదేమైనా ఈ మూడు సినిమాలలో ఏ ఒక్క చిత్రానికి సీక్వెల్ వచ్చినా గౌతమ్ మీనన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతారని చెప్పవచ్చు. కాగా గౌతమ్ మీనన్ ఇటీవల లాక్ డౌన్ లో 'ఏమాయ చేసావే'కి సీక్వెల్ గా షార్ట్ ఫిల్మ్ చేసిన విషయం తెలిసిందే. శింబు - త్రిష పాత్రలతో ఈ లఘు చిత్రాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా విక్రమ్ తో తీస్తున్న 'ధృవ నక్షత్రం'.. కొత్త వారితో తీసిన 'జోషువా ఇమై పోల్ కాఖ' సినిమాలు విడుదల అవ్వాల్సి ఉన్నాయి.
Tags:    

Similar News