'గుర్తుందా శీతాకాలం' అందుకే ఆలస్యం అవుతోందా..?

Update: 2022-09-19 23:30 GMT
సౌత్ స్టార్ మిల్కీ బ్యూటీ తమన్నా మరియు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ జంటగా నటించిన చిత్రం ''గుర్తుందా శీతాకాలం''. నాగశేఖర్ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ తెరకెక్కింది. ఇందులో మేఘా ఆకాష్ - కావ్య శెట్టి వంటి మరో ఇద్దరు హీరోయిన్లు కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. చివరగా సెప్టెంబర్ 23న థియేటర్లలో 'గుర్తుందా శీతాకాలం' చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు చెప్పిన తేదీకి రాకపోవచ్చని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా 'గుర్తుందా శీతాకాలం' మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేయడం లేదు. దీంతో మరోసారి వాయిదా పడబోతోందని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అదే నిజం కాబోతోందని నెట్టింట చర్చ జరుగుతోంది.

నిజానికి ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. బిజినెస్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. అయితే కొత్త బయ్యర్లు సరైన థియేటర్లు తీసుకురాలేకపోవడంతోనే.. విడుదల ఆలస్యం అవువుతోందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

'గుర్తుందా శీతాకాలం' ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సినిమాపై అందరిలో ఆసక్తి క్రియేట్ చేసింది. సత్యదేవ్ - తమన్నా కెమిస్ట్రీ హైలైట్ గా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇది కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమా ఆధారంగా తెరకెక్కింది.

ఎంఎస్ రెడ్డి సమర్పణలో నాగ‌శేఖ‌ర్ మూవీస్ - శ్రీ వేదాక్షర మూవీస్ - మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై 'గుర్తుందా శీతాకాలం' చిత్రాన్ని రూపొందించారు. చిన బాబు -  భావ‌న‌ ర‌వి - నాగశేఖర్ - రామారావు చింతపల్లి నిర్మాతలుగా వ్యవహరించారు.

కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. సత్యా హెగ్డే సినిమాటోగ్రఫీ అందించారు. లక్ష్మీభూపాల్ డైలాగ్స్ రాశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News