ప‌బ్లిక్ ఫంక్ష‌న్ లో కొడుకుల‌తో త‌మిళ హీరో హ‌ల్ చ‌ల్‌

Update: 2022-03-20 02:30 GMT
కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ గ‌త కొన్ని రోజులుగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. గ‌త కొన్ని రోజుల క్రితం త‌న బార్య ఐశ్వ‌ర్యతో విడిపోతున్నానంటూ ప్ర‌క‌టించి షాకిచ్చారు. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ధ‌నుష్ - ఐశ్వ‌ర్య లు చేసిన ప్ర‌క‌ట‌న త‌మిళ ఇండ‌స్ట్రీలో తీవ్ర క‌ల‌క‌లాన్ని సృష్టించింది. సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ వీరిద్ద‌రు విడిపోకూడ‌ద‌ని చాలా ప్ర‌య‌త్నాలు చేశార‌ని, అయితే అవేవీ ఫ‌లించ‌క‌పోవ‌డంతో ఫైన‌ల్ గా ఇద్ద‌రు విడిపోయార‌ని త‌మిళ వ‌ర్గాలు కూడా చెప్పుకొచ్చాయి.

ఆ త‌రువాత ధ‌నుష్ తండ్రి క‌స్తూరి రాజా ధ‌నుష్ - ఐశ్వ‌ర్య విడిపోవ‌డం టీ క‌ప్పులో తుఫాను అని, వారు మ‌ళ్లీ క‌లుస్తార‌ని ప్ర‌క‌టించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. ధ‌నుష్, తెలుగు, త‌మిళ చిత్రాల‌లో బిజీగా మారిపోయారు. ఐశ్వ‌ర్య ద‌ర్శ‌కురాలిగా బిజీ అయింది. ఎవ‌రి ప‌నుల్లో వారు క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తున్నారు. అయితే వీరిద్ద‌రికి పుట్టిన ఇద్ద‌రు పిల్ల‌లు మాత్రం ధ‌నుష్ ని అంటిపెట్టుకుని వుండ‌టం ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.

ధ‌నుష్ - ఐశ్వ‌ర్య విడిపోయినా.. విడాకుల‌కు సిద్ధ‌మై ఎవ‌రికి వారే య‌మునాతీరే అనే స్థాయిలో వేరుగా వుంటున్నా ధ‌నుష్ మాత్రం త‌న ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి వుంటుండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంత వ‌ర‌కు త‌న కొడుకుల‌తో క‌లిసి ప‌బ్లిక్ ఫంక్ష‌న్ ల‌కు రాని ధ‌నుష్ తొలిసారి త‌న ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి చెన్నైలో జ‌రిగిన `రాక్ విత్ రాజా` లైవ్ కాన్స‌ర్ట్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి.

ధ‌నుష్ - ఐశ్వ‌ర్య‌ల‌కు యాత్ర‌, లింగ అని ఇద్ద‌రు అబ్బాయిలు వున్న విష‌యం తెలిసిందే. అయితే వారిని ఇంత వ‌ర‌కు ప‌బ్లిక్ గా ఎవ‌రికీ ఈ మాజీ దంప‌తులు చూపించ‌లేదు. ఎలాంటి ప‌బ్లిక్ ఫంక్ష‌న్ ల‌కు తీసుకురాలేదు. చివ‌రికి ధ‌నుష్ త‌న సినిమా ఫంక్ష‌న్‌ల‌కి కూడా వీరితో క‌లిసి పాల్గొన‌లేదు. కానీ చెన్నైలో జ‌రిగిన ఇళ‌య‌రాజా నిర్వ‌హించిన `రాక్ విత్ రాజా` లైవ్ కాన్స‌ర్ట్ కి రావ‌డం విశేషం. ధ‌నుష్ ఈ ఈవెంట్ లో వైట్ పంచ‌, వైట్ హాఫ్ ష‌ర్ట్ ధ‌రించి వ‌చ్చారు.

పెద్ద కుమారుడు యాత్ర బ్లూ క‌ల‌ర్ ష‌ర్ట్, జీన్స్ లో రాగా చిన్న వాడు లింగ వైట్ ష‌ర్ట్ బ్యూ జీన్స్ ధ‌రించి క‌నిపించాడు. పెద్ద కుమారుడు యాత్రం అచ్చం ధ‌నుష్ ని పోలి వుండి ప‌క్క ప‌క్క‌నే డ‌బుల్ యాక్ష‌న్ ని చూసిన‌ట్టుగా వుంద‌ని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌. కాగా ఈ ఈవెంట్ లో పాల్గొన్న ధ‌నుష్ వేదిక‌పైకి వెళ్లి ఓ పాట కూడా పాడ‌టం విశేషం.
Tags:    

Similar News