`బాహుబ‌లి -3`లో `అవెంజ‌ర్స్` స్టార్?

Update: 2019-03-08 13:32 GMT
బాహుబ‌లి సిరీస్ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. బాహుబ‌లి - ది బిగినింగ్, బాహుబ‌లి- ది క‌న్ క్లూజ‌న్ చిత్రాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2500 కోట్లు వ‌సూలు చేసాయ‌ని క్రిటిక్స్ అంచ‌నాలు వేసారు. ఆ క్ర‌మంలోనే ఎస్.ఎస్.రాజ‌మౌళి ఈ సినిమాల‌కు సీక్వెల్ తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. లేదూ ప్రీక్వెల్ ఆలోచ‌న‌లో ఉన్నార‌ని కూడా ప్ర‌చార‌మైంది. అయితే రాజ‌మౌళి అనూహ్య ంగా త‌నకు ఆ ఆలోచ‌న ఇప్ప‌ట్లో లేద‌ని చెప్పారు. అంటే భ‌విష్య‌త్‌లో ఒక‌వేళ ఈ ఫ్రాంఛైజీని కొన‌సాగించే ఆలోచ‌న లేద‌ని కూడా చెప్ప‌లేదు. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెబుతుంది! అన్న సందిగ్ధ‌త‌న అభిమానుల్లో అలానే ఉంచాడు.

అయితే బాహుబ‌లి సిరీస్ లో మూడో చిత్రం తెర‌కెక్కుతుందా.. లేదా? అన్న‌ది అటుంచితే ఈ సిరీస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప స్టార్ల మ‌న‌సుల్ని దోచింది అన‌డానికి ప్ర‌ఖ్యాత హాలీవుడ్ స్టార్ చేసిన కామెంట్ ఓ నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. హాలీవుడ్ భారీ యాక్ష‌న్ ఎడ్వ ంచ‌ర‌స్ మూవీ అవెంజ‌ర్స్ న‌టుడు శ్యామ్యూల్స్ ఎల్‌.జాక్స‌న్ ఓ యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ .. బాహుబ‌లి 3 తెర‌కెక్కిస్తే ఆ చిత్రంలో న‌టించాల‌నుంద‌ని వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌న‌మైంది.

`కెప్టెన్ మార్వెల్‌` ప్రచారం కోసం అత‌డు ఇండియాకి ప‌య‌న‌మ‌య్యే ఆలోచ‌న‌లోనూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇండియాకు వెళ్తారా అని హోస్ట్ త‌న‌ని ప్రశ్నించగా.. నాకు పని కల్పిస్తే వెళ్తా అంటూ జాక్సన్‌ అన్నారు. అనంతరం బాలీవుడ్‌లో పనిచేస్తారా? అని  ప్ర‌శ్నిస్తే .. బాహుబలి 3 చిత్రం కోసం పనిచేయాలని ఉంది అన్నారు. దీంతో మరోసారి `బాహుబలి` ఫ్రాంఛైజీ గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అన్నా బోడెన్, ర్యాన్ ఫ్లెక్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ` కెప్టెన్‌ మార్వెల్‌` నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై పాజిటివ్ స‌మీక్ష‌లు అందుకుంది. అవెంజ‌ర్స్, ప‌ల్ప్ ఫిక్ష‌న్ స‌హా వంద‌లాది చిత్రాల్లో శ్యామ్యూల్స్ జాక్స‌న్ న‌టించారు. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌ను మ‌న జ‌క్క‌న్న గ‌మ‌నించి `బాహుబ‌లి 3` ని యూనివ‌ర్శ‌ల్ ఆడియెన్ కోసం ప్లాన్ చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News