ఐసీయూలో ఆ స్టార్ నటుడు!

Update: 2020-04-28 16:30 GMT
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాత్ రూమ్ లో క్రిందపడి అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌ లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు జాతీయ న్యూస్ ఛానల్స్ వెల్లడించాయి. ఇర్ఫాన్ ఖాన్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన లండన్‌లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని గత ఏడాది సెప్టెంబర్‌ లో తిరిగి ముంబై చేరుకున్నారు. భారత్‌ కు తిరిగి వచ్చిన తరువాత ఆ మధ్య మరోసారి తన ఆరోగ్యం పై స్పందించారు ఇర్ఫాన్. తాను పూర్తిగా కోలుకోలేదని.. ఇక ఇక్కడే ఉంటూ రెగ్యులర్ చెకప్ చేయించుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత 'అంగ్రేజీ మీడియం' సినిమాలో నటించగా.. ఆ సినిమా లాక్ డౌన్ కి రెండు రోజుల ముందు రిలీజయింది. అయితే అంతలోనే ఈయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం ఈ మధ్య కన్ను మూసింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు ఇర్ఫాన్. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో కాల్ ద్వారా వీక్షించి ఎంతో బాధపడ్డాడు. తల్లి మరణంతో ఆయన డిప్రెషన్‌ లోకి వెళ్ళాడట. ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలైయ్యాడు.

ప్రస్తుతం ఇర్ఫాన్ ఖాన్‌ ముంబాయిలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్నాడు. 53 ఏళ్ల ఇర్ఫాన్ ఖాన్‌కు డాక్లర్టు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక హాస్పిట‌లో ఆయన వెంట భార్య సుతాపా సిక్దర్ మరియు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు నుంచి కానీ.. హాస్పిటల్ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. కాగా అప్పట్లోనే ఇర్ఫాన్ ఖాన్ నేను బతికేది కొన్ని రోజులే అంటూ అప్పట్లో ఓ వీడియో విడుదల చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా తల్లి మరణంతో కృంగిపోయిన ఇర్ఫాన్‌కు క్యాన్సర్ తిరగబెట్టినట్టు తెలుస్తోంది. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. అంతేకాదు తన నటనతో ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కాలు అందుకున్నారు. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన 'సైనికుడు' సినిమాలో నటించారు. ఇర్ఫాన్ ఖాన్ ఆసుపత్రి కావడంతో ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
Tags:    

Similar News