చ‌ర‌ణ్ కు బ‌న్నీ హీరోయిన్ త‌ప్ప మ‌రో ఛాయిస్ లేదా?

Update: 2022-02-10 08:30 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మార్చి 25న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. దాదాపు మూడేళ్లుగా వాయిదాప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ మొత్తానికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైపోతోంది. భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించారు. ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీం ల‌కు సంబంధించిన ఓ పీరియ‌డ్ ని  తీసుకుని ఫిక్ష‌న‌ల్ క‌థ‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు.

ఈ చిత్రం విడుద‌ల‌కు ముస్తాబ‌వుతున్న నేప‌థ్యంలో ఇందులో న‌టించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌మ త‌దుప‌రి ప్రాజెక్ట్ ల‌పై దృష్టిపెట్టారు. ఎన్టీఆర్ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ చిత్రానికి రెడీ అయిపోగా.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ .. శంక‌ర్ చిత్రంతో పాటు మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి మూవీకి రెడీ అయిపోతున్నారు. ఇప్ప‌టికే శంక‌ర్ తో చేయ‌బోతున్న పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ కోసం ద‌ర్శ‌కుడు శంక‌ర్ లొకేష‌న్ ల వేట‌లో వున్నారు. మ‌రి కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ని ఏపీలో చిత్రీకరించ‌బోతున్నారు.

ఇందు కోసం ఇప్ప‌టికే నిర్మాణ సంస్థ ఏపీ పోలీసుల‌కు ప‌ర్మీష‌న్ కోసం విన‌తి ప‌త్రాన్ని కూడా సమ‌ర్పించింది. ఇదిలా వుంటే తాజాగా గౌత‌మ్ తిన్న‌నూరితో రామ్ చ‌ర‌ణ్ చేయ‌నున్న మూవీకి సంబంధించిన వార్త‌లు కూడా ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. యువీ క్రియేష‌న్స్, ఎన్‌వి ఆర్ సినిమాలు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించ‌బోతున్నాయి.

శంక‌ర్ తో చేస్తున్న పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ పూర్తి కాగానే రామ్ చ‌ర‌ణ్ .. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి చిత్రాన్ని ప్రారంభిస్తార‌ట‌. గ‌త ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా ఈ మూవీని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తాజా వార్త‌ల ఫిల్మ్ స‌ర్కిల్స్ లో వైర‌ల్ గా మారింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇందులో హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న్న నటించ‌నుంద‌ని తెలుస్తోంది. ఆమెనే మెయిన్‌ ఛాయిస్ అని చెబుతున్నారు.  

`పుష్ప‌` చిత్రంతో ర‌ష్మిక క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. అంతే కాకుండా త‌ను ప్ర‌స్తుతం వ‌రుస‌గా బాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. ఇప్ప‌టికే `ఆచార్య‌`లో పూజా హెగ్డేతో క‌లిసి న‌టించిన రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ తో చేస్తున్న మూవీ కోసం మ‌ళ్లీ కైరా అద్వానీనే ఎంచుకోవాల్సి వ‌చ్చింది.

దీంతో ర‌ష్మిక‌ని త‌ప్ప త‌న త‌దుప‌రి చిత్రానికి మ‌రో హీరోయిన్ ని ఎంచుకునే ఆప్ష‌న్ లేక‌పోవ‌డంతో ర‌ష్మిక మంద‌న్న‌ని ఫైన‌ల్ చేసుకున్నార‌ని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. హీరోయిన్ ల కొర‌త వుండ‌టంతో మ‌రో ఆప్ష‌న్ లేని చ‌ర‌ణ్ ఫైన‌ల్ గా ర‌ష్మిక‌ని గౌత‌మ్ తిన్న‌నూరి చిత్రానికి ఫైన‌ల్ చేసుకున్నార‌ట‌. 
Tags:    

Similar News