ట్రెండీ టాక్: అన్నా చెల్లెళ్ల మ‌ధ్య బిగ్ ఫైట్!

Update: 2022-07-21 02:30 GMT
క‌పూర్ గాళ్ జాన్వీ..  క‌పూర్ బోయ్ అర్జున్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. ఈ పేర్లు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్ర‌తీక. బోనీ క‌పూర్ వార‌సులు ఇరువురూ ఎంతో క‌లివిడిగా క‌లిసి మెలిసి ఉంటారు. అయితే ఇప్పుడు అన్న‌తో పోటీప‌డుతోంది జాన్వీ. తాను న‌టించిన సినిమా అర్జ‌న్ క‌పూర్ న‌టించిన సినిమా ఒకే రోజు విడుద‌ల‌వుతుండ‌డంతో ఇద్ద‌రిలో ఎవ‌రు బెస్ట్ అని నిరూపిస్తారు? అంటూ సోష‌ల్ మీడియాల్లో బిగ్ డిబేట్ సాగుతోంది.

జాన్వీ కపూర్ Vs అర్జున్ కపూర్... గుడ్ లక్ జెర్రీ వ‌ర్సెస్ ఏక్ విలన్..! అంటూ ఫ్యాన్స్ డిబేట్లు పెడుతున్నారు. ఇలాంటి స‌న్నివేశం ఇదివ‌ర‌కెన్న‌డూ లేదు. ఒకే రోజు అన్నా చెల్లెళ్లు ఘర్షణకు దిగుతున్నారు. ఇద్ద‌రిలో ఎవరు బాగా రాణిస్తారు? అంటూ అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది.

గుడ్ లక్ జెర్రీ .. ఏక్ విలన్ రిటర్న్స్ ట్రైల‌ర్స్ ఆక‌ట్టుకున్నాయి. ఇవి రెండూ ఈ ఏడాది భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్న సినిమాల జాబితాలో ఉన్నాయి. జూలై 29న విడుదల కానున్నాయి. జాన్వీ చిత్రం డిస్నీ+హాట్ స్టార్ లో ప్రీమియర్ కు రెడీ అవుతుండ‌గా... అర్జున్ న‌టించిన‌ యాక్షన్-థ్రిల్లర్ థియేట‌ర్ల‌లోకి రానుంది. జాన్వీ- అర్జున్ ల సినిమాలు ఒకే రోజు ఇలా ఢీకొనడం ఇదే తొలిసారి. 'గుడ్ లక్ జెర్రీ' తమిళ చిత్రం కొలమావు కోకిల (2018)కి రీమేక్.  త‌మిళ వెర్ష‌న్ లో నయనతార - యోగి బాబు ప్రధాన పాత్రలలో నటించిన సంగ‌తి తెలిసిందే. ఏక్ విలన్ రిటర్న్స్ సిద్ధార్థ్ మల్హోత్రా - శ్రద్ధా కపూర్ నటించిన 2014 చిత్రం ఏక్ విలన్ కి సీక్వెల్ క‌థాంశంతో తెర‌కెక్కింది.

గుడ్ లక్ జెర్రీలో జాన్వీ బీహార్ నుండి వలస వచ్చిన జయ (జెర్రీ) కుమారి పాత్రను పోషించింది. ఆమె 2వ దశ క్యాన్సర్ తో బాధపడుతున్న తన తల్లికి మెడిసిన్ బిల్లులు చెల్లించడానికి పంజాబ్ లో డ్రగ్ డీలర్ గా మారుతుంది. అటుపై ఏం జ‌రిగింది? అన్న‌దే క‌థాంశం. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్- మితా వశిష్ట్- నీరజ్ సూద్- సుశాంత్ సింగ్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించారు. సుభాస్కరన్ అల్లిరాజా- ఆనంద్ ఎల్. రాయ్ - మహావీర్ జైన్ ఈ మూవీని నిర్మించారు.

అర్జున్ ఏక్ విలన్ రిటర్న్స్ లో అర్జున్ క‌పూర్- తారా సుతారియా.... జాన్ అబ్రహం -దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ - టి-సిరీస్ బ్యానర్లపై శోభా కపూర్- ఏక్తా కపూర్- భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ దీనిని నిర్మించారు. ఈ చిత్రానికి మోహిత్ సూరి  దర్శకత్వం వహించారు. ఆయ‌నే ర‌చ‌యిత కూడా. కపూర్ సోదర-సోదరీమ‌ణుల‌ ద్వయం ప్రస్తుతం ప్రమోష‌న్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.

ఇత‌ర సినిమాల మ్యాట‌ర్ కి వ‌స్తే.. అర్జున్ .. జాన్వీ ఇద్ద‌రూ బిజీ స్టార్స్. జాన్వీ ప్ర‌స్తుతం వరుణ్ ధావన్ తో కలిసి బవాల్ లో నటిస్తోంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి - మిలీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. అర్జున్  త‌దుప‌రి లేడీ కిల్ల‌ర్ లో న‌టిస్తున్నాడు.  ఇందులో మొదటిసారి భూమి పెడ్నేకర్ తో కలిసి ప‌ని చేస్తున్నాడు. ఆస్మాన్ భరద్వాజ్ 'కుట్టే'లో టబు- కొంకణా సేన్ శర్మ- రాధిక మదన్- నసీరుద్దీన్ షా - కుముద్ మిశ్రాతో కలిసి పని చేయనున్నాడు. మునుముందు భారీ పాన్ ఇండియా చిత్రాల‌కు అత‌డు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడ‌ని తెలిసింది.
Tags:    

Similar News