తార‌క్ ట్రిపుల్ ధ‌మాకా పార్టీలో క‌పుల్స్ హ‌ల్చ‌ల్

Update: 2022-03-27 16:08 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన పార్టీలో క‌పుల్స్ హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇది ట్రిపుల్ ధ‌మాకా పార్టీ అంటే అతిశ‌యోక్తి కాదు. తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ కోసం ఈ ఏర్పాటు చేశాడు. ఓ వైపు ఆర్.ఆర్.ఆర్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్ అలాగే మరొక ప్రత్యేకత కూడా ఉంది. మార్చి 26న లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు కాగా మరుసటి రోజు అంటే మార్చి 27న రామ్ చరణ్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. రెండింటికీ ఏక‌మొత్తంగా ఘ‌న‌మైన పార్టీని ఏర్పాటు చేశారు తార‌క్.

పార్టీ నుంచి ఇప్ప‌టికే కొన్ని ఫోటోలు వెబ్ లోకి వ‌చ్చాయి. తాజాగా ఉపాసన ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోని షేర్ చేశారు. ఇందులో చరణ్ అలాగే ప్రణతి ఇద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ - చరణ్ ల మధ్య ఉన్న ఆ స్నేహబంధానికి చిహ్న‌మిది. అలాగే ఉపాస‌న - ప్ర‌ణ‌తి మ‌ధ్య స్నేహం వెల్లివిరుస్తోంద‌న‌డానికి ఈ ఫోటో సాక్ష్యం.

ఆ రెండు జంట‌ల‌తో పాటే అదే సమయంలో రాజమౌళి కుమారుడు కార్తికేయ అతని భార్యతో కలిసి అదే చిత్రంలో పోజులిచ్చాడు. స్నేహితులందరూ గత రాత్రి చాలా సరదాగా గడిపార‌న‌డానికి ఇదే ఆధారం. క‌పుల్స్ ఇలా పార్టీ మూడ్ ని ఆస్వాధించార‌న్న‌మాట‌. భేష‌జాలు అన్న‌వే లేకుండా చరణ్ - తారక్ మధ్య అపారమైన స్నేహం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటే వారి భార్య‌లు అంతే స‌న్నిహితంగా ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సెల‌బ్రిటీ జంట‌లు ఒకేచోట క‌నిపిస్తే వీక్షించేందుకు అభిమానులు అంతే ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.
Tags:    

Similar News