బికినీ పై కామెంట్ చేసారని విరుచుకుపడిన బాలీవుడ్ క్వీన్..?

Update: 2020-12-25 03:30 GMT
ఇండస్ట్రీలో ఎలాంటి మొహమాటం లేకుండా మనసుకు ఏదనిపిస్తే అది ముఖం మీదే చెప్పడం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తీరు. చూసేవాళ్ళు, ఆమె మాటలు వినేవాళ్ళు అందరూ అది పొగరు అనుకుంటే.. కంగనా మాత్రం కేవలం ముక్కుసూటితనమే అంటుంది. కొందరికి కంగనా తీరు నచ్చుతుంది కానీ ఆ ముక్కుసూటితనమే కొన్నిసార్లు వివాదాలలోకి నెట్టేస్తుంది. అలాగని కంగనా తీరు మార్చుకునే రకం కాదు. తాజాగా ఈ భామ సోషల్ మీడియా యూజర్ల పై మండిపడింది. కొంతమంది నెటిజన్లు కంగనా పోస్ట్ చేసిన బికినీ ఫోటో పై ట్రోల్ చేసినందుకు కంగనా విరుచుకు పడింది. ఎవరు కూడా మతాల పై అధికారం ఉన్నట్లు ప్రవర్తించ వద్దని సజెస్ట్ చేసింది.

ఈ బాలీవుడ్ క్వీన్ ఇటీవల మెక్సికో సెలవులలో ఎంజాయ్ చేసిన త్రోబాక్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు బీచ్‌లో బికినీ ధరించి కూర్చుంది. ఆ పోస్ట్ చూసిన కొంతమంది నెటిజన్లు కంగనా ఫోటో పై ఇబ్బందికరమైన కామెంట్స్ చేశారు. అయితే ఆ కామెంట్స్ చూసిన కంగనా.. ట్విట్టర్‌లో సెల్ఫ్ క్లిక్ చేసిన ఫోటో షేర్ చేసి హిందీలో ట్వీట్ పెట్టింది. “నా బికినీ చిత్రాన్ని చూసి కొంతమంది నన్ను సనాతన ధర్మం గురించి ఉపన్యాసం ఇస్తున్నారు. భైరవి దేవత తన జుట్టును వదులుగా, బట్టలు లేకుండా, రక్తం తాగుతూ మీకు ఎదురుపడితే మీరేం చేస్తారు? భయపడతారు. మిమ్మల్ని మీరు భక్తుడు అని అనుకుంటున్నారా? మతంపై అధికారం ఉన్నట్లు నటించవద్దు…. జై శ్రీ రామ్” కంగనా స్ట్రాంగ్ గా రాసిపెట్టింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కంగనా నటిస్తున్న తలైవి మూవీ కోసం సౌత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేగాక కంగనా దాకాడ్, తేజస్ సినిమాలను కూడా లైన్ లో పెడుతోంది.
Tags:    

Similar News