ఆ చెత్తను నేను పట్టించుకోను

Update: 2019-02-26 10:58 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేత కౌశల్‌ ఈమద్య కాలంలో ఆయన అభిమానులతోనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 లో కౌశల్‌ విజేతగా ఎదగడంలో కౌశల్‌ ఆర్మీ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కౌశల్‌ ఆర్మీ చిన్నపాటి యుద్దం చేసి కౌశల్‌ ను గెలిపించుకున్న విషయం తెల్సిందే. కౌశల్‌ ఆర్మీ చేసిన ఫైట్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఆర్మీకి చెందిన వారే కౌశల్‌ పై విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల కొందరు కౌశల్‌ ఆర్మీ మెంబర్స్‌ కౌశల్‌ పై విమర్శలు చేయడం జరిగింది. కౌశల్‌ ఆర్మీ కొన్ని విషయాలపై కౌశల్‌ ను టార్గెట్‌ చేస్తున్నారు. పలు వివాదాస్పద అంశాలను లేవనెత్తుతున్నారు. వాటికి కౌశల్‌ సమాధానాలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కౌశల్‌ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. తాజాగా అభిమానుల విమర్శలపై స్పందిస్తూ... కొందరు నన్ను కిందికి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.

బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ఉన్నప్పుడు నేను ఎలా ఉండే వాడినో ఇప్పుడు అలాగే ఉన్నాను. నాలో ఎలాంటి మార్పు రాలేదు, నా వ్యక్తిత్వంలో మార్పు రాలేదు. అయినా కూడా కొందరు నాపై పనికట్టుకుని విమర్శలు చేస్తున్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు అలాంటి విమర్శలను నేను పట్టించుకోను అంటూ కౌశల్‌ చెప్పుకొచ్చాడు. మొత్తానికి కౌశల్‌ క్రేజ్‌ మెల్ల మెల్లగా తగ్గిపోవడంతో పాటు, ఆయనపై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. బిగ్‌ బాస్‌ వల్ల వచ్చిన స్టార్‌ డంను ఆయన ఇంకా వినియోగించుకోకుండానే ఆ స్టార్‌ డంను కోల్పోతున్నాడు.

Tags:    

Similar News