మహేష్ బాబు హీరోయిన్ షాకిచ్చింది..

Update: 2018-08-22 08:35 GMT
మహేష్ బాబు నటించిన 1-నేనొక్కడినే చిత్రం ద్వారా కృతి సనన్ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా అటూ ఇటూ కావడంతో తన ఫుల్ ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీదే పెట్టింది. ప్రస్తుతం అక్కడ ఆమెకు వరుస అవకాశాలు వస్తుండడంతో అక్కడే ఉంటోంది.

తాజాగా కృతీసనన్ గుర్రపు స్వారీ చేస్తోంది. ‘రాబ్తా’ సినిమా కోసం ఆమె హార్స్ రైడింగ్ నేర్చుకుంది. ఇప్పుడు ఈ రైడింగ్ స్కిల్స్ కు మరింత పదనుపెట్టి స్పీడ్ గా వెళ్లడం నేర్చుకుంటోందట.. దీనికి కారణం కూడా ఉంది.. తాజాగా కృతి సనన్ కు ‘పానీపట్’ అనే పీరియాడికల్ మూవీలో అవకాశం వచ్చింది.  ప్రఖ్యాత బాలీవుడ్ ఫిలిం మేకర్ అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో సంజయ్ దత్ - అర్జున్ కపూర్ - కృతీసనన్ - కబీర్ బేడి ముఖ్యతారలుగా నటిస్తున్నారు. ఇందులో అర్జున్ కపూర్ రెండో భార్యగా కృతీ సనన్ నటిస్తోందట..

ఈ సినిమాలోని పీరియాడిక్ డ్రామాలో కృతి గుర్రపు స్వారీ వేగంగా చేయాల్సి ఉంటుందట.. అందుకే ప్రస్తుతం దానిమీదే తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ సినిమాలో మరాఠీ వారియర్ గా కృతీ కనిపించనుందట. గతంలో కంటే ఇప్పుడు గుర్రపు స్వారీ బాగా వేగంగా చేస్తున్నాననీ.. కంట్రోల్ బాగా అవుతోందని చెప్పుకొస్తోంది కృతీ..
Tags:    

Similar News