హీరో నిక్క‌రు టీష‌ర్టు గిఫ్టిచ్చాడా ర‌ష్మికా?

Update: 2022-03-12 08:32 GMT
బ్యాక్ టు బ్యాక్ హిందీ చిత్రాల‌తో బిజీ అయిపోతోంది ర‌ష్మిక‌. ఓవైపు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా లాంటి కుర్ర‌హీరోతో 'మిష‌న్ మ‌జ్ను'లో న‌టించేసింది. ఈ చిత్రం జూన్ 10న విడుద‌ల‌వుతోంది. సిద్ధార్థ్ తో క‌లిసి ర‌ష్మిక బోలెడంత ప్ర‌చారం చేస్తోంది సినిమాకి.

మ‌రోవైపు యంగ్ ధావ‌న్ బోయ్ తో కొత్త సినిమాని ప్రారంభించి బిజీ షూటింగ్ లో ఉంది ర‌ష్మిక. ఈ విష‌యాన్ని త‌నే ఇటీవ‌ల వెల్ల‌డించి షాకిచ్చింది. అమితాబ్ జీతో గుడ్ బాయ్ కూడా చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే వ‌రుణ్ ధావ‌న్ తో సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఇప్ప‌టికే నేష‌న‌ల్ క్ర‌ష్ ధావ‌న్ బోయ్ తో ఎంతో స‌న్నిహితంగా క‌లిసిపోయి బోలెడన్ని చిల్లింగ్ మూవ్ మెంట్స్ ని ఆస్వాధిస్తోంది. ఈ వీడియోలో ధావ‌న్ బోయ్ తో ర‌ష్మిక ప‌రాచికం కూడా అంతే హైలైట్ గా నిలిచింది. తాజాగా ర‌ష్మిక టీష‌ర్ట్ నిక్క‌రు తొడుక్కుని వీధిలో వెళుతూ క‌నిపించింది. ఇది వీక్షించాక హీరోగారు నిక్క‌రు దాన‌మిచ్చారా? అంటూ అభిమానుల్లో సందేహం మొద‌లైంది.

ఇప్ప‌టికే 'అరబిక్ కుతు ఛాలెంజ్'ని స్వీకరించిన ర‌ష్మిక ..ధావ‌న్ తో క‌లిసి స్టెప్పులేసిన తీరు షాకిచ్చింది. తర్వాత వరుణ్ ధావన్ - రష్మిక మందన్న ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఛాలెంజ్ లో భాగంగా తారలు బీస్ట్ లోని దళపతి విజయ్- పూజా హెగ్డే  వైరల్ పాట హలమితి హబీబోకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తున్నారు. స్టార్ లు జనాదరణ పొందిన ఛాలెంజ్ ని స్వీక‌రించ‌డం వారి ప్రదర్శనను షేర్ చేయ‌డం తెలిసిన‌దే.

తాజా వీడియోలో ఈ జంట ఇసుకపై నృత్యం చేస్తూ క‌నిపించారు. వరుణ్ ధావన్ ఈ పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చాడు. యో హబీబో... ఇసుక మీద డ్యాన్స్ చేయడం బావుంది.. అలాగే ఈ వీడియో నటీనటుల అభిమానుల నుండి చాలా ప్రేమను ఆద‌ర‌ణ‌ను పొందింది.

రష్మిక మందన్న త‌న కెరీర్ ను ఒక వాణిజ్య ప్రకటన కోసం మోడల్ గా ప్రారంభించింది. అక్కడ నుండి కిరిక్ పార్టీ నిర్మాతలు రక్షిత్ శెట్టి సరసన ప్రధాన పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారు. తన తొలి చిత్రం విజయం తర్వాత రష్మిక పునీత్ రాజ్‌కుమార్ తో కలిసి అంజనీ పుత్ర మరియు గణేష్ సరసన చమక్ కు సంతకం చేసింది. ఆమె మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరులో కూడా నటించింది. ఆమె చివరిగా అల్లు అర్జున్ -ఫహద్ ఫాసిల్ కలిసి నటించిన పుష్ప: ది రైజ్ అనే హిట్ చిత్రంలో కనిపించింది.

త‌దుప‌రి బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బై చిత్రంలో నటిస్తోంది. దీనికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్ ఒక నిర్మాత‌. మిషన్ మజ్ను లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రష్మిక నటించింది. నిర్మాత డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ వ‌రుస హిట్ల‌తో జోరుమీదున్నాడు. అక్టోబర్- హంప్టీ శర్మ కి దుల్హనియా- ABCD 2- బద్లాపూర్- దిల్‌వాలే- జుద్వా 2 వంటి చిత్రాలలో తన పాత్రల‌తో పాపుల‌ర‌య్యాడు. 2012 చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో అత‌డు బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు.

అతను చివరిసారిగా సారా అలీ ఖాన్ తో కూలీ నంబర్ 1 రీమేక్ లో కనిపించాడు. ఇది 2020లో విడుదలైంది. వరుణ్ ధావన్ తదుపరి చిత్రం జగ్ జగ్ జీయోలో కనిపించనున్నాడు. ఇందులో అనిల్ కపూర్- నీతూ కపూర్- కియారా అద్వానీ మరియు ప్రజక్తా కోలి కలిసి నటించారు. అతను కృతి సనన్ తో కలిసి భేడియాలో కూడా కనిపించనున్నాడు.


Full View

Tags:    

Similar News