శర్వా 'ఆడవాళ్లు..' కోసం సరికొత్త రిలీజ్ డేట్..!

Update: 2022-02-19 14:45 GMT
వర్సటైల్ హీరో శర్వానంద్ నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ''ఆడవాళ్లు మీకు జోహార్లు'' రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కుటుంబ సమేతంగా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగేలా ఈ చిత్రానికి క్లీన్ 'యు' (U) సర్టిఫికేట్ లభించింది. ఈ విషయాన్ని వెల్లడించిన మేకర్స్.. సరికొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 25న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే అదే రోజున పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండటంతో.. శర్వానంద్ చిత్రాన్ని తదుపరి వారానికి వాయిదా వేశారు.

2022 మార్చి 4వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించి గందరగోళానికి ముగింపు పలికారు. మార్చి 3న ఈ సినిమా యూఎస్ఏ ప్రీమియర్‌లు పడనున్నాయి.

కాగా, 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు.

ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించారు. ఇందులో శర్వానంద్‌ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఖుష్బు - రాధిక శరత్‌ కుమార్ - ఊర్వశి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ - రవిశంకర్ - సత్య - ప్రదీప్ రావత్ - గోపరాజు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు సెన్సేషనల్ హిట్‌ గా నిలిచాయి. అలానే టీజర్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. సుజిత్‌ సారంగ్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు.
Tags:    

Similar News